బస్సు యాత్రను మళ్లీ వాయిదా వేసుకున్న జనసేనాని!

పవన్ కల్యాణ్ దసరా నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు బస్సు యాత్ర చేయాలనుకున్నారు . ఇందు కోసం జన సైనికులు కూడా రెడీ అయ్యాయి. పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ అనూహ్యంగా తన యాత్రను వాయిదా వేసుకుంటున్నట్లుగా ప్రకటించారు. దీంతో జనసేన శ్రేణుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎప్పుడో ఓ సారి వచ్చి .. ప్రసంగాలు చేయడం మినహా పవన్ నేరుగా ప్రత్యక్షంగా చేసిన ఉద్యమాలు దాదాపుగా లేవు.

ఎన్నికల ఏడాదిలో అయినా ఆయన పూర్తి సమయం రాజకీయాలకే కేటాయిస్తారని ఆశించారు. కానీ చివరికి యాత్రను వాయిదా వేసుకున్నారు. జనవాణి కార్యక్రమంలో చాలా ఆర్జీలు వచ్చాయని వాటిని అధ్యయనం చేసేందుకు సమయం తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు వచ్చే నెల నుంచి నియోజకవర్గాల వారీ సమీక్షలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఓ వైపు టీడీపీ తరపున లోకేష్ పాదయాత్రకు రెడీ అవుతున్నట్లుగా ప్రచారం జరుగుతున్న సమయంలో పవన్ తన బ స్సు యాత్రను వాయిదా వేయడం .. జనసైనికుల్ని ఇబ్బంది పెడుతోంది.

మరో వైపు పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 47-67 మధ్య మాత్రమే సీట్లు వస్తాయని స్పష్టంచేస్తున్నారు. అంటే ప్రభుత్వం మారుతుందని అంటున్నారు. అయితే ఖచ్చితంగా జనసేన పార్టీ వస్తుందని చెప్పలేదు. కానీ గెలిచే వారికే టిక్కెట్లిస్తామని చెప్పుకొచ్చారు. మొత్తానికి పవన్ కల్యాణ్ ఎప్పట్లాగే తన అస్పష్ట విధానాన్నే మరోసారి బయట పెట్టారు కానీ.. స్పష్టమై రాజకీయ ఆలోచన మాత్రం ప్రజల ముందు పెట్టలేకపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మా రాష్ట్రానికి రండి… రేవంత్ కోసం 7 రాష్ట్రాల రిక్వెస్ట్!

గెల‌వ‌టం అసాధ్య‌మ‌నుకున్న తెలంగాణ‌లో పార్టీని గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డికి... ఇత‌ర రాష్ట్రాల నుండి మా రాష్ట్రానికి రండి అంటూ ఇన్విటేష‌న్లు వ‌స్తున్నాయి. మా రాష్ట్రంలో తెలుగు వారున్నారు మీరు రండి అంటూ...

నేల దిగిన విక్ర‌మ్‌… ఈసారి కొట్టేస్తాడేమో..?!

విక్ర‌మ్ న‌టుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ప్ర‌తీసారీ ఏదో ఓ రూపంలో కొత్త‌ద‌నం ఇవ్వాల‌నే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంటాడు. అదే త‌న ప్ల‌స్సు, అదే మైన‌స్సు కూడా. మితిమీరిన ప్ర‌యోగాల‌తో చేతులు కాల్చుకోవ‌డం...

మోత్కుపల్లి ఏ పార్టీలో ఉన్నా అంతే !

మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని.. మఖ్యమంత్రి రేవంత్ తప్పు చేస్తున్నారని తెరపైకి వచ్చారు. ఒక రోజు దీక్ష చేస్తానని ప్రకటించారు. నిజానికి మోత్కుపల్లి...

తగ్గేదేలే – తోట త్రిమూర్తులే అభ్యర్థి !

దళితుల శిరోముండనం కేసులో దోషిగా తేలి జైలు శిక్షకు గురైన మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిముర్తులకు జగన్ అభయం ఇచ్చారు. జైలు శిక్ష పడినా అభ్యర్థి ఆయనేనని స్పష్టం చేయడంతో ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close