ఇంకో ఆప్ష‌న్ లేకే… ప‌వ‌న్ ఇలా చేశాడా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల‌న్నీ వ‌రుస‌గా ప‌ట్టాలెక్కేయ‌బోతున్నాయి. ప్ర‌స్తుతం కాట‌మ‌రాయుడుతో బిజీగా ఉన్నాడు ప‌వ‌న్‌. ఆ వెంట‌నే నేస‌న్ సినిమా, దాని త‌ర‌వాత త్రివిక్ర‌మ్ సినిమా ప‌ట్టాలెక్కేస్తాయి. ఆల్మోస్ట్ హీరోయిన్లు కూడా ఫిక్స‌యిపోయారు. కాక‌పోతే.. నేస‌న్ సినిమాని సాయేషా సైగ‌ల్‌ని తీసుకోవ‌డ‌మే ప‌వ‌న్ అభిమానుల‌కు మింగుడు ప‌డ‌డం లేదు. ప‌వ‌న్ ప‌క్క‌న సాయేషా ఏమాత్రం ఆన‌ద‌ని, ఓ ఫ్లాప్ హీరోయిన్‌ని ఎందుకు తీసుకొన్నారో అని బెంగ పెట్టుకొన్నారు. అఖిల్ సినిమాలో సాయేషా ఉద్ద‌రించిందేం లేదు. ఆమె న‌ట‌న‌కు, గ్లామ‌ర్‌కీ మైన‌స్ మార్కులే ప‌డ్డాయి. అఖిల్ త‌ర‌వాత ఎవ్వ‌రూ ఆమె వైపు చూళ్లేదు. అలాంటిది ప‌వ‌న్ ఏరి కోరి ఎందుకు ఎంచుకొన్నాడో.. అన్న‌ది అభిమానుల డౌట్‌.

నిజానికి సాయేషా ఎంపిక అంత ఈజీగా ఏం జ‌ర‌గ‌లేదు. ముందు చాలా ఆప్ష‌న్లు ప‌రిశీలించారు. స్టార్ హీరోయిన్ల లిస్టు వేసుకొని.. ఒకొక్క‌రి కాల్షీట్లూ వెదికారు. అయితే ఎవ్వ‌రూ అందుబాటులో లేరు. ఇప్పుడు దూసుకుపోతున్న న‌వ‌త‌రం హీరోయిన్ల‌నీ అడిగి చూశారు. ప‌వ‌న్ బృందం అడుగుతున్న డేట్లు ఏ ఒక్క‌రూ స‌ర్దుబాటు చేయ‌లేక‌పోయారు. అప్పుడు ఖాళీ భామ‌ల జాబితా ఒక‌టి త‌యారైంది. ఆ ప్లేసులో ముందున్న పేరు సాయేషానే. అలా.. సినిమాల్లేక ఖాళీగా ఉండ‌డం సాయేషాకు క‌లిసొచ్చింది. దానికి తోడు ఈ సినిమాని వీలైనంత త‌క్కువ బ‌డ్జెట్‌లో చేయ‌మ‌ని ప‌వ‌న్ సూచించాడ‌ట‌. స్టార్ క‌థానాయిక అంటే ఎంత కాద‌న్నా కోటి రూపాయ‌లు ఇవ్వాలి. అంత ఇవ్వ‌లేక‌.. సాయేషా ద‌గ్గ‌ర హీరోయిన్ అన్వేష‌ణ ఆపార‌ని స‌మాచారం. అదీ.. సాయేషా ఎంపిక వెనుక ఉన్న స్టోరీ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close