పవన్ కల్యాణ్ సినిమాలన్నీ వరుసగా పట్టాలెక్కేయబోతున్నాయి. ప్రస్తుతం కాటమరాయుడుతో బిజీగా ఉన్నాడు పవన్. ఆ వెంటనే నేసన్ సినిమా, దాని తరవాత త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కేస్తాయి. ఆల్మోస్ట్ హీరోయిన్లు కూడా ఫిక్సయిపోయారు. కాకపోతే.. నేసన్ సినిమాని సాయేషా సైగల్ని తీసుకోవడమే పవన్ అభిమానులకు మింగుడు పడడం లేదు. పవన్ పక్కన సాయేషా ఏమాత్రం ఆనదని, ఓ ఫ్లాప్ హీరోయిన్ని ఎందుకు తీసుకొన్నారో అని బెంగ పెట్టుకొన్నారు. అఖిల్ సినిమాలో సాయేషా ఉద్దరించిందేం లేదు. ఆమె నటనకు, గ్లామర్కీ మైనస్ మార్కులే పడ్డాయి. అఖిల్ తరవాత ఎవ్వరూ ఆమె వైపు చూళ్లేదు. అలాంటిది పవన్ ఏరి కోరి ఎందుకు ఎంచుకొన్నాడో.. అన్నది అభిమానుల డౌట్.
నిజానికి సాయేషా ఎంపిక అంత ఈజీగా ఏం జరగలేదు. ముందు చాలా ఆప్షన్లు పరిశీలించారు. స్టార్ హీరోయిన్ల లిస్టు వేసుకొని.. ఒకొక్కరి కాల్షీట్లూ వెదికారు. అయితే ఎవ్వరూ అందుబాటులో లేరు. ఇప్పుడు దూసుకుపోతున్న నవతరం హీరోయిన్లనీ అడిగి చూశారు. పవన్ బృందం అడుగుతున్న డేట్లు ఏ ఒక్కరూ సర్దుబాటు చేయలేకపోయారు. అప్పుడు ఖాళీ భామల జాబితా ఒకటి తయారైంది. ఆ ప్లేసులో ముందున్న పేరు సాయేషానే. అలా.. సినిమాల్లేక ఖాళీగా ఉండడం సాయేషాకు కలిసొచ్చింది. దానికి తోడు ఈ సినిమాని వీలైనంత తక్కువ బడ్జెట్లో చేయమని పవన్ సూచించాడట. స్టార్ కథానాయిక అంటే ఎంత కాదన్నా కోటి రూపాయలు ఇవ్వాలి. అంత ఇవ్వలేక.. సాయేషా దగ్గర హీరోయిన్ అన్వేషణ ఆపారని సమాచారం. అదీ.. సాయేషా ఎంపిక వెనుక ఉన్న స్టోరీ.