ఈ రాజముద్ర విలువ రూ. 150 కోట్లు!

రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నారు. కానీ రాజముద్ర కోసం ఓ వ్యక్తి వందల కోట్లను మంచినీళ్లలా ఖర్చు పెట్టాడు. వేలం పాటలో దాన్ని సొంతం చేసుకుని పండగ చేసుకున్నాడు. చైనా అంటే డ్రాగన్. ఈ రాజముద్రపై దొమ్మిది డ్రాగన్ చిత్రాలు చెక్కారు.

18వ శతాబ్దంలో చైనాను పాలించిన క్విన్ లాండ్ అనే రాజుకు చెందిన రాజముద్రను ప్యారిస్ లోని డ్రౌ ఔట్ వేలం శాలలో వేలం వేశారు. ఎన్నో కొన్ని వేల పౌండ్లు రాకపోతాయా అనుకున్నారు. కానీ అశ్చర్యకరంగా వేలం పోటాపోటీగా జరిగింది. చివరకు 17.6 మిలియన్ పౌండ్లకు ఓ చైనా వ్యక్తి సొంతం చేసుకున్నాడు. అంటే మన కరెన్సీలో సుమారు 150 కోట్ల రూపాయలు.

అందమైన నగిషీతో ఆకర్షణీయగా ఉన్న ఈ రాజముద్రను సొంతం చేసుకున్న వ్యక్తి వివరాలు మాత్రం గోప్యం. ఆ వ్యక్తి వివరాలను నిర్వాహకులు ప్రకటించలేదు. 18వ శతాబ్దానికి చెందిన ఈ రాజముద్రను 19వ శతాబ్దంలో ఓ ఫ్రెంచి సంపన్నుడు సొంతం చేసుకున్నాడు. తర్వాత కాలక్రమంలో అది ప్యారిస్ లోని వేలం శాలకు చేరింది.

అందమైన అలనాటి కళాఖండాన్ని సొంతం చేసుకోవడానికి సంపన్నులు పోటీ పడటం మామూలే. అయితే ఈ రాజముద్రకు తాము ఊహించిన దానికంటే 20 రెట్లు ఎక్కువ ధర పలికిందని నిర్వాహకులు ఖుషీ ఖుషీగా చెప్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close