ఉత్తరాంధ్ర నుంచి పవన్ పోటి?

నసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేస్తారనే విషయం మీద రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని ఆమధ్య పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించాడు. అదేవిధంగా ఆ తర్వాత పిఠాపురం సభలో కూడా, అన్నీ కుదిరితే పిఠాపురం నుండి పోటీ చేస్తానని ప్రకటించాడు. ఇక ఏలూరు నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అక్కడ పార్టీ ఆఫీసు ప్రారంభించిన మొదట్లో వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ గాజువాక నుండి పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. వివరాల్లోకి వెళితే..

ఎవరు ఎక్కడనుండి ఎన్నికల్లో పోటీ చేయాలనే విషయాన్ని నిర్ణయించడానికి జనసేన పార్టీ తరఫున ఒక స్క్రీనింగ్ కమిటీ ఇటీవలే ఏర్పాటయింది. ఆ స్క్రీనింగ్ కమిటీ, పవన్ కళ్యాణ్ గాజువాక నుండి పోటీ చేస్తే బాగుంటుందని సూచించినట్లుగా తెలుస్తోంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, జనసేన పార్టీ పెట్టిన మిస్స్డ్ కాల్ ద్వారా పార్టీలో చేరే ప్రోగ్రామ్లో రాష్ట్రంలోనే అత్యధికంగా గాజువాక ప్రాంతం నుండి కార్యకర్తలు నమోదు కావడం, రెండు, గాజువాక ప్రాంతం నుండి పోటీ చేయడం వ్యూహాత్మకంగా పార్టీకి లాభిస్తుందని అంచనా ఉండడం. ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా పని చేసిన వాళ్లు అందరూ కూడా ఎక్కువగా రాయలసీమ ప్రాంతం నుండి లేదా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారే తప్పించి ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి వచ్చిన వారు లేరు. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి ఉత్తరాంధ్ర ప్రాంత నియోజకవర్గం నుండి పోటీ పడితే, ఆ ప్రభావం ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం మీద చూపుతుంది అన్న అంచనాతో పార్టీ స్క్రీనింగ్ కమిటీ పవన్ కళ్యాణ్ ని గాజువాక నుండి పోటీ చేయమని కోరుతున్నట్టుగా తెలుస్తోంది.

అయితే పవన్ కళ్యాణ్ గాజువాక నుండి పోటీ చేస్తారా లేక ఇంకేదైనా నియోజకవర్గం నుండి పోటీ చేస్తారా అనేది తెలియాలంటే కనీసం మరొక నెల రోజులు వేచి చూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇప్పటికీ ఎన్డీఏ వెంట పడుతున్న జగన్ !

రాజకీయం అంటే విదిలించుకున్నా వదిలి పెట్టను అని కాళ్లు పట్టేసుకోవడం కాదు. కానీ వైసీపీ అధినేతకు మాత్రం అదే రాజకీయం. ఎందుకంటే వదిలిస్తే కేసులకు కొట్టుకుపోతారు. అందుకే బీజేపీ వాళ్లు విదిలించుకున్నా ...

ఆన్న ఆస్తి ఇవ్వకపోతే షర్మిల కోర్టుకెళ్లవచ్చుగా !?

సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంచివ్వలేదని.. ఒక్కకొసరు ఆస్తి రాసిచ్చి దాన్ని కూడా అప్పు కింద జమ చేసుకున్నారని షర్మిల వేదనకు గురయ్యారు. తన పిల్లలకు తాను ఏమీ ఇవ్వలేకపోతున్నానని ఆమె ఆవేదన...

మేనిఫెస్టో మోసాలు : ఎస్సీ, ఎస్టీలకు చెప్పింది ఒక్కటి కూడా చేయలేదేందయ్యా !

జగన్ మోహన్ పాదయాత్రలో కొన్ని వందల హామీలు ఇచ్చారు. కానీ అవేమీ మేనిఫెస్టోలో పెట్టలేదు. అందుకే ఇప్పుడు తాము ఆ హామీలు ఇవ్వలేదని వాదిస్తూ ఉంటారు. తప్పుడు ఆలోచనలు చేసే వారి రాజకీయాలు...

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close