మోడీతో నేడు పవన్ కల్యాణ్ భేటీ..!?

బీజేపీతో పొత్తు తర్వాత పవన్‌ కల్యాణ్‌ దూకుడు పెంచారు. కమలంతో పొత్తుకు అమరావతియే రాజధాని ఉండాలన్న హామీ కూడా ఓ కారణం అంటున్నారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందని కరాఖండిగా పవన్‌ చెప్పడం వెనుక ఢిల్లీ నుంచి బలమైన హామీ ఉందనే అభిప్రాయం .. ఇతర పార్టీల్లోనూ వినిపిస్తోంది. సాయంత్రం హస్తినలో బీజేపీ- జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరగబోతోంది..! ఈ మీటింగ్‌కు బీజేపీ అగ్రనేతలతో పాటు పవన్‌ కల్యాణ్‌ హాజరవుతారు. ఇందులో రాజధాని మార్పు అంశమే ప్రధాన అజెండాగా ఉంటుంది. అందుకే పవన్‌ సైతం తన ఢిల్లీ టూర్‌పై రైతులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. అమరావతి ఇక్కడి నుంచి కదలదని తేల్చి చెబుతున్నారు.

ఢిల్లీ సమావేశంలో ఏం జరగబోతుందో పవన్‌ మాటల్లోనే స్పష్టంచేశారు.  రైతుల ఆందోళనలను, ఆవేదనను వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం లెక్క చేయకపోవడంతో.. ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగక తప్పదనే జనసేన, బీజేపీ భావిస్తోంది. అందుకే ఈ రెండు పార్టీలు దీనిపై పోరాటానికే సిద్ధమయ్యారు. రాజధానిని మార్చే నిర్ణయం జగన్‌కి లేదని బీజేపీ చెబుతుంటే.. అసలు రాజధాని ఇంచు కూడా కదలదని జనసేన అంటోంది. దీంతో పవన్‌ ఢిల్లీ టూర్‌ రాజధాని పోరాటంలో టర్నింగ్‌ పాయింట్‌ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు.  ఏపీలో కలిసిగట్టుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించిన బీజేపీ, జనసేన పార్టీలు.. ఇప్పుడు రాజధాని మార్పు అంశాన్ని ఉమ్మడి అజెండాగా మార్చుకున్నాయి.

ఇప్పుడు ఈ రెండు పార్టీల సమన్వయ భేటీల వేదిక ఢిల్లీకి మారడంతో.. అక్కడ వ్యూహం సిద్ధమడం ఖాయం అనుకోవచ్చు. రాజధాని రైతులు కూడా కేంద్రం స్పందించాలని చెబుతున్నారు. ఇదే ఇప్పుడు కీలక అంశంగా మారింది. రాజధాని పోరాటంలో పవన్‌ హస్తిన పర్యటనే కీలకం. నరేంద్రమోడీతో భేటీ కావాలని.. పవన్ కల్యాణ్ చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటి వరకూ సాధ్యం కాలేదు. ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో ఆయనకు.. అపాయింట్‌మెంట్ ఖరారయిందని చెబుతున్నారు. అదే జరిగితే మోడీ దగ్గర కూడా.. పవన్ కల్యాణ్ అమరావతి వాయిస్ వినిపించే అవకాశం ఉంది.  

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close