కూకట్‌పల్లికే పవన్ ప్రచారం పరిమితం !

తెలంగాణలో జనసేన పోటీ చేస్తున్న ఎనిమిది స్థానాల్లో ఒక్క కూకట్ పల్లిలో మాత్రమే పవన్ కల్యాణ్ ప్రచారం చేయనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి 26వ తేదీన తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఆ రోజున కూకట్ పల్లిలో బహిరంగసభ ఏర్పాటు చేశారు. పవన్ తో పాటు అమిత్ షా కూడా పాల్గొనేలా నిర్ణయించారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఆ ఒక్క బహిరంగసభ తప్ప పవన్ కల్యాణ్ ఎక్కడా ప్రచారం చేసే అవకాశాలు కనిపించడం లేదు.

తెలంగాణలో ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అభ్యర్థులు అంతా.. గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం లేని వాళ్లు కావడంతో ఎన్నికల నిర్వహణలో ఇబ్బంది పడుతున్నారు. ఆర్థిక సమస్యల గురించి పక్కన పెడితే.. గట్టిగా వారి కోసం ప్రచారం చేసేవారు రావడం లేదు. ప్రతీ పార్టీకి ఆయా పార్టీల ముఖ్య నేతలు వచ్చి ప్రచారం చేస్తున్నారు. కానీ జనసేన నేతల పరిస్థితి భిన్నంగా ఉంది. కనీసం బీజేపీ నేతలైనా వస్తారేమోనని ఎదురు చూస్తున్నారు. కానీ సమన్వయం చేసేవారు లేక తంటాలు పడుతున్నారు.

పవన్ ఒక్కో నియోజకవర్గానికి గంటో.. రెండు గంటలో కేటాయించి… రెండు రోజుల పాటు రోడ్ షోలు పెట్టుకుంటే బాగుంటుందని జనసేన వర్గాలు అనుకుంటున్నాయి. కానీ పవన్ ఇలా ప్రచార బరిలోకి దిగితే.. బీజేపీ నుంచి కూడా ఒత్తిడి వస్తుందన్న ఆలోచనతో… ఆ ప్రతిపాదన విరమించుకున్నారని అంటున్నారు. మొత్తంగా ఒక్క కూకట్ పల్లి అభ్యర్థికి మాత్రమే పొత్తులో భాగంగా రెండు పార్టీలు కలిసి ప్రచారం చేయబోతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

‘విద్య వాసుల అహం’ రివ్యూ: మ‌ళ్లీ పాత పెళ్లి కథే!

తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా' ప్రతి వారం ఎదో ఒక కొత్త సినిమా ఉండేలా ప్లాన్ చేస్తుకుంటుంది. ఈ వారం రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ నటించిన 'విద్య వాసుల అహం' ప్రేక్షకులు...

కడప కోర్టు తీర్పు రాజ్యాంగవిరుద్ధంగా ఉందన్న సుప్రీంకోర్టు

వివేకా హత్యపై మాట్లాడవద్దని కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు మండిపడింది. కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని.. వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని స్పష్టం...

కౌంటింగ్‌లో సహకరించాలన్నట్లుగా ఈసీని బెదిరిస్తున్న సజ్జల !

అయిందేదో అయిపోయింది.. ఇక తప్పు దిద్దుకో అని ఈసీని హెచ్చరించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈసీ ఏం తప్పు చేసిందో.. ఎలా దిద్దుకోవాలనుకుంటున్నారో ఆయన పరోక్షంగానే తన మాటలతో సందేశం పంపారు. అదేమిటంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close