రూ. 30వేల కోట్ల దుబారా..! అమరావతిపై పీటర్ రిపోర్ట్..!

రాజధాని అమరావతిలో రూ. 30వేల కోట్ల దుబారా జరిగిందని… జగన్మోహన రెడ్డి సర్కార్ నియమించిన పీటర్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. రాజధాని ,ప్రాజెక్టులు, నిర్మాణాలు ,అవకతవకలపై పీటర్ నేతృత్వంలో ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీ రాజధానిలోని ప్రతి ప్రాజెక్టు ,నిర్మాణాలను పున సమీక్షించాలని నివేదిక లో పేర్కొంది, రాజధానిలో చేపట్టిన నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు కమిటీ తేల్చింది. అవసరానికి మించి రెట్టింపు వ్యయం చేశారని… నివేదికలో కమిటీ తెలిపింది. సుమారుగా రూ.30 వేల కోట్ల మేర దుబారా జరిగినట్లు పీటర్ కమిటీ సభ్యులు అంచనా వేశారు. 75 శాతం పైగా పూర్తి అయిన టవర్లు, భవనాల విషయం ఏం చేయాలన్న విషయాన్ని ప్రభుత్వ నిర్ణయానికి కమిటీ వదిలేసింది.

మిగిలిన అన్నింటినీ సమీక్షించాలని సిఫార్సు చేసింది. ప్రభుత్వం ఏర్పడగానే… అన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల పనులను నిలిపివేసిన ప్రభుత్వం వాటిపై నిపుణుల కమిటీని నియమించింది. మొదటగా ఈ పీటర్ నేతృత్వంలో ఓ కమిటీ పోలవరంపై అధ్యయనం చేసి… పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను కేంద్రానికి కూడా ఏపీ సర్కార్ ఇచ్చింది. ఆ నివేదికలో పేర్కొన్న అంశాలపై ఆధారాలను కేంద్రం అడగడంతో… తాము ఆ నివేదికను విశ్వసించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం… సమాధానం పంపింది. పోలవరంలో అవకతవకలు జరగలేదని.. లేఖ రాయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇదే పీటర్ కమిటీ అమరావతిపైనా.. అదే తరహా నివేదిక ఇచ్చింది.

అయితే.. ఈ సారి రాజధానిలో అవినీతి జరిగిందని కాకుండా… దుబారా జరిగిందని నివేదిక ఇవ్వడం … ఆసక్తికరంగా మారింది. అవినీతి జరిగిందని… నివేదిక ఇస్తే… న్యాయపరంగా ఎలా నిర్ధారించారనే ప్రశ్నలు వస్తే.. చిక్కులు ఎదురవుతాయనే.. పీటర్ కమిటీ సభ్యులు దుబారా అంటూ నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నివేదిక ప్రకారం… ప్రభుత్వం రాజధాని నిర్మాణాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

అలాంటి పెళ్లి చేసుకోను: ఫరియా అబ్దుల్లాతో చిట్ చాట్

‘జాతిరత్నాలు’ సినిమాతో మెరిసింది ఫరియా అబ్దుల్లా. ‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందా నా గుండె ఖలాసే’ అంటూ యూత్ హృదయాల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు అల్లరి నరేష్ కి జోడిగా...

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close