యూరీ ఉగ్ర దాడులపై మోడీ స్పందన బేష్!

కాశ్మీర్ లో యూరీపై ఉగ్రవాదులు దాడులు చేసి 18 మంది సైనికులని పొట్టన పెట్టుకొన్నాక అందుకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఏమాత్రం బాధ పడలేదు. కాశ్మీర్ లో జరుగుతున్న హింసకి ప్రతీకారంగా జరిగిన సంఘటన అది అని అన్నారు. తద్వారా భారత్ చేసిన తప్పులకి అదే మూల్యం చెల్లించుకొందన్నట్లుగా మాట్లాడారు. పాకిస్తాన్ పై యుద్దానికి దిగవలసిన భారత్ అ ప్రస్తావన చేయనే లేదు కానీ పాక్ పాలకులు యుద్ధం నుంచి అణుబాంబులు వేయడం వరకు చాలా మాట్లాడేసి తమ యుద్ధోన్మాదాన్ని మరోసారి బయటపెట్టుకొన్నారు.

ఈరోజు కేరళలోని కోజికోడ్ పట్టణంలో జరిగిన భాజపా జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఆ సంఘటన గురించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ పాక్ పాలకులకి పూర్తి భిన్నంగా పాక్ ప్రజల మనసులకి కూడా హత్తుకుపోయే విధంగా చాలా విషయాలు మాట్లాడారు.

ఒకే సమయంలో స్వాతంత్ర్యం పొందిన భారత్ ఇప్పుడు ఏ స్థాయికి చేరుకొందో, ఇప్పుడు పాక్ ఎటువంటి దుస్థితిలో ఉందో చెప్పారు. పాక్ పాలకులు, లోపభూయిష్టమైన వారి విధానాలే అందుకు కారణమని మోడీ చెప్పారు. భారత్ నుంచి నిపుణులైన ఇంజనీర్లు విదేశాలకి వెళ్ళి వాటి అభివృద్ధిలో పాలుపంచుకొంటుంటే, పాకిస్తాన్ ఉగ్రవాదులని తయారుచేసి విదేశాలకి ఎగుమతి చేస్తూ అన్ని చోట్లా విద్వంసం సృష్టిస్తోందని అన్నారు. ఒక్క పాకిస్తాన్ తప్ప మిగిలిన ఆసియా దేశాలన్నీ అభివృద్ధి గురించే ఆలోచిస్తూ ఆ దిశలోనే ముందుకు సాగిపోతున్నాయని అన్నారు. పాక్ మాత్రం ఉగ్రవాదం దగ్గరే ఆగిపోయిందని అన్నారు.

ఇక్కడ మేము మా సైనికులని పోగొట్టుకొని బాధపడుతుంటే, ఉగ్రవాదులుగా మారి ప్రాణాలు పోగొట్టుకొంటున్న మీ బిడ్డల కోసం అక్కడ మీరు బాధపడటం లేదా? అని పాక్ ప్రజల మనసులని కదిలించే ప్రశ్న వేశారు. ఒకప్పుడు అందరూ ఈ భారత్ గడ్డకి నమస్కరించినవారే.. కానీ భారత్ నుంచి పాక్ విడిపోయిన తరువాత పాక్ పాలకులు భారత్ పట్ల విద్వేష వైఖరిని అవలంభిస్తూ తమ దేశాన్నే భ్రష్టు పట్టించారని విమర్శించారు.

పాకిస్తాన్ తన అధీనంలో ఉన్న కాశ్మీర్ నే చక్కదిద్దుకోలేకపోయినా భారత్ లో అంతర్భాగంగా ఉన్న కాశ్మీర్ గురించి అనవసరమైన మాటలు చాలా మాట్లాడుతోందని అన్నారు. భారత్ సహనాన్ని పరీక్షించవద్దని మోడీ పాలకులకి హెచ్చరించారు. కానీ తన ప్రసంగంలో ఎక్కడా పాక్ తో యుద్ధం చేసే ఆలోచన ఉన్నట్లుగా మాట్లాడలేదు. ఆకలి, పేదరికంపై కలిసి యుద్ధం చేద్దామని చెప్పడం ద్వారా నేటికీ పాక్ పట్ల భారత్ కి సానుభూతి ఉందని, అది తన తీరు మార్చుకొంటే దానితో కలిసి పనిచేయడానికి భారత్ కి ఏమీ అభ్యంతరం లేదని మోడీ చెప్పకనే చెప్పారు. పాక్ పాలకులు భారత్ తో యుద్ధం చేసి భారత్ పై అణుబాంబులు వేసి సర్వనాశనం చేస్తామని అనుచితంగా మాట్లాడుతుంటే, మోడీ అభివృద్ధి గురించి మాట్లాడి వారికీ మనదేశానికి ఆలోచనా విధానంలో ఎంత తేడా ఉందో నిరూపించి చూపారని చెప్పవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close