యస్వీ విద్యార్ధులతో జగన్ సమావేశానికి అనుమతి నిరాకరణ?

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోరుతూ ఈనెల 26 నుండి గుంటూరులో ఆమరణ నిరాహారా దీక్షకు కూర్చోబోతున్నారు. కానీ ప్రతీసారి ఏదో ఒక అంశం మీద ఆయన దీక్ష చేయడం, దానికి పార్టీ నేతలు భారీ ప్రచారం, జనసమీకరణ చేస్తుంటారు. కానీ కొన్నిసార్లు జనసమీకరణ చేయడంలో విఫలమయినప్పుడు జగన్ అభాసుపాలయిన సందర్భాలున్నాయి. కనుక ఈసారి జగన్ దీక్షకు రాష్ట్రం నలుమూలల నుండి విద్యార్ధులను, యువకులను ఆకర్షించేందుకు జగన్ స్వయంగా వివిధ జిల్లాలో విద్యార్దీ సంఘాలతో సమావేశం అయ్యి ప్రత్యేక హోదాపై పోరాటం చేయవలసిన ఆవశ్యకత గురించి వివరించబోతున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే తిరుపతి యస్వీ యూనివర్సిటీ విద్యార్దులతో సమావేశం కావాలనుకొన్నారు.

కానీ విశ్వవిద్యాలయంలో వైకాపా రాజకీయ సమావేశాలను అనుమతించబోమని ప్రభుత్వం చెప్పడంతో వైకాపా నేతలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రభుత్వానికి శ్రద్ద లేదు కనుకనే తమ సమావేశానికి అనుమతి నిర్కారిస్తోందని విమర్శిస్తున్నారు. కానీ తమ అధినేత జగన్ విద్యార్ధులతో తప్పకుండా సమావేశం అవుతారని వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకటించారు. ఈవిధంగా కూడా వైకాపా మీడియా దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నట్లుంది. జగన్మోహన్ రెడ్డిని యూనివర్సిటీలో సమావేశం నిర్వహించకుండా పోలీసులు అడ్డుకొన్నట్లయితే, ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ పోరాడుతుంటే దానినీ ప్రభుత్వం పోలీసులచేత అణచి వేయించేస్తోందని ఆరోపిస్తూ జగన్ అక్కడే మరో దీక్షకు కూర్చొంటారేమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

తమ్మినేనికి డిగ్రీ లేదట – అది ఫేక్ డిగ్రీ అని ఒప్పుకున్నారా ?

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం నామినేషన్ వేశారు. అఫిడవిట్ లో తన విద్యార్హత డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. కానీ ఆయన తనకు డిగ్రీ పూర్తయిందని చెప్పి హైదరాబాద్ లో...

గుంతకల్లు రివ్యూ : “బెంజ్‌ మంత్రి”కి సుడి ఎక్కువే !

మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు బెంజ్ మంత్రి అని పేరు పెట్టారు టీడీపీ నేతలు. ఇప్పుడా బెంజ్ మంత్రిని నెత్తికి ఎక్కించుకుని మరీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించడానికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో ఓ...

బ్యాండేజ్ పార్టీ : వైసీపీ డ్రామాలపై జనం జోకులు

వెల్లంపల్లి కంటికి బ్యాండేజ్ వేసుకుని తిరుగుతున్నారు. ఈ విషయంలో పక్కనున్న జనం నవ్వుతున్నారని కూడా ఆయన సిగ్గుపడటం లేదు. కంటికి పెద్ద ఆపరేషన్ జరిగినా రెండు రోజుల్లో బ్యాండేజ్ తీసేస్తారు నల్లకళ్లజోడు పెట్టుకోమంటారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close