ప్రియాంక హత్య కేసు : అసలు నిందితులు పోలీసులే..!

ప్రియాంక రెడ్డి హత్య కేసులో పోలీసులు అచ్చం సినిమాల్లో వ్యవహరించినట్లే వ్యవహరించారు. అయితే.. హీరోయిక్ మూవ్ కాదు.. అచ్చంగా…అది బ్యాడ్ పోలీస్ రియాక్షనే. రాత్రి పన్నెండు గంటలకు ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయిస్తే.. వారి స్పందన అత్యంత ఘోరంగా ఉంది. పోలీసులు తమతో అమర్యాదగా ప్రవర్తించారని అమ్మాయి మిస్సైందని ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే.. ఎవరితో లేచిపోయిందో అని మాట్లాడారని ప్రియాంక తండ్రి కన్నీరుమున్నీరవుతున్నారు. మా పరిధిలోకి రాదని శంషాబాద్ పోలీసులు చెప్పారని రూరల్ పీఎస్‌లో ఫిర్యాదు చేయమన్నారన్నారు. అక్కడికి వెళ్తే ప్రియాంక అదృశ్యమైన ప్రాంతం శంషాబాద్‌కే వస్తుందన్నారని.. ఫిర్యాదు తీసుకోవడానికే రెండు, మూడు గంటలు తిప్పించారని ప్రియాంక తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసుల నుంచే తీవ్ర జాప్యం జరిగిందని .. ముందే పోలీసులు స్పందిస్తే మా అమ్మాయి బతికుండేదేమోనని కన్నీరు పెట్టుకుంటున్నారు. వంతెన కింద శవం కాలుతుందన్న సమాచారం వచ్చిన తర్వాతే పోలీసులు కేసు నమోదు చేశారు. వారు కదిలే సరికే ఘోరం జరిగిపోయింది. ప్రియాంక రెడ్డి హత్య కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పాషా అనే లారీ డ్రైవర్ తో పాటు క్లీనర్లు నలుగురు కలిసి ప్రియాంక రెడ్డిపై అత్యాచారం హత్య చేసినట్లుగా గుర్తింంచారు.

నిందితులు మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. టోల్ ప్లాజా వెనకాల ఉన్న ఖాళీ ప్రదేశంలో ప్రియాంకరెడ్డిని రేప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ప్రియాంక రెడ్డిని కిరోసిన్ తో కాల్చి చంపినట్లు పోస్టుమార్టం రిపోర్ట్‌లో గుర్తించారు. కిరోసిన్ అని తేలడంతో లారీ డ్రైవర్లే చంపినట్టు నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ప్రియాంకరెడ్డి హత్య ఘటన… దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అత్యంత దారుణంగా.. ఒంటరిగా అమ్మాయి కనబడితే.. తోడేళ్ల మాదిరిగా.. అత్యాచారం చేసి చంపిన ఘటన..సభ్యసమాజంలో భయాందోళనలు నింపుతోంది. సోషల్ మీడియాలోనూ ఇదే టాపిక్ ట్రెండింగ్ అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

వైసీపీకి ఏబీవీ భయం – క్యాట్ ముందు హాజరు కాని ఏజీ !

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం...

అప్పుల క‌న్నా ప‌న్నులే ఎక్కువ‌… ప‌వ‌న్ ఆస్తుల లిస్ట్ ఇదే!

సినిమాల్లో మాస్ ఇమేజ్ ఉండి, కాల్ షీట్ల కోసం ఏండ్ల త‌ర‌బ‌డి వెయిట్ చేసినా దొర‌క‌నంత స్టార్ డ‌మ్ ఉన్న వ్య‌క్తి ప‌వ‌న్ క‌ళ్యాణ్. పిఠాపురం నుండి పోటీ చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close