మహువా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తే ఎవరికి అవమానం !?

ప్రశ్నలు అడగడానికి డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలపై తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వం రద్దు చేయాలని లోక్ సభ ఎథిక్స్ కమిటీ సిఫారసు చేసింది. చేయాలనుకుంటే… ఎప్పుడైనా ఆమెను పార్లమెంట్ కు రాకుండా కట్టడిచేయవచ్చు. కానీ ఇందులో ఎన్నో సందేహాలు ఉన్నాయి. అందులో మొదటిది.. ప్రశ్నలు అడగడానికి ఆమె డబ్బులు తీసుకున్నారా లేదా అని నిరూపితం కావడం.

మహువా మొయిత్రా పార్లమెంట్ లో ప్రభుత్వాన్ని నిలదీసే స్వరం. ఆమె ప్రసంగాలను దేశ ప్రజలు ఆసక్తిగా చూస్తారు. ప్రధానంగా ఆమె అాదానీ దోపిడీ గురించి మాట్లాడుతూ ఉంటారు. అదానీకి ఆరు విమానాశ్రయాలను అప్పగించడం గురించి, గంగవరం రేవు వంటివి కట్టబెట్టడాన్ని ప్రశ్నిస్తూ మహువా మొయిత్రా పార్లమెంటులో ప్రశ్నలు సంధించారు. అదానీ తనకు అప్పగించిన ఆరు విమానాశ్రయాల పనిని చేపట్టడంలో జాప్యం చేస్తున్నందున ప్రభుత్వ నష్టాలు పేరుకుపోతున్నాయని కూడా ఆమె పార్లమెంటు దృష్టికి తెచ్చారు. కోల్ స్కాం గురించి వివరాలు బయట పెట్టారు.

మొయిత్రా ఈ ప్రశ్నలను అదానీ గ్రూపుకి పోటీగా వున్న హీరానందానీ గ్రూపు తరపున వేశారని అందుకు లంచం తీసుకొన్నారని బిజెపి ఎంపి నిశికాంత్ దూబే లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. హీరానందానీ గ్రూపు సిఇఒ దర్శన్ హీరానందానీ కూడా ఇందుకు గొంతు కలిపారు. డబ్బు కోసం ఆమె తనపై ఒత్తిడి తెచ్చేవారని హీరానందానీ ఆరోపించారు. ఎవరైనా డబ్బులిచ్చిన వారు ఇలా చెబుతారా ? కానీ ఇక్కడ చెబుతారు. అయితే ఆమె డబ్బు తీసుకొన్నట్టు రుజువులు ఇంత వరకు లభించలేదు. అటువంటప్పుడు ఆమె లోక్‌సభ సభ్యత్వం రద్దుకు ఎథిక్స్ కమిటీ ఏ విధంగా సిఫార్సు చేసిందనేది కీలకమైన ప్రశ్న.

మొత్తానికి అన్ని వైపుల నుంచి కుట్రలు చేసి.. ఒక ఫైర్ బ్రాండ్ ఎంపి లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయించే పని మాత్రం వేగంగా సాగుతోంది. అధికారంలో వున్న వారు తమ రాజకీయ ప్రత్యర్థుల నోరు మూయించడానికి ఇటువంటి పన్నాగాలు పన్నుతున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఎవరి అవమానం. మహువాకా.. భారత ప్రజాస్వామ్యానికా ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారం ముగిసింది – 30న అసలు యుద్ధం !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అసలు ప్రచారం ముగిసింది. ఇప్పటి వరకూ ప్రచారంలో ముందు మేమున్నామంటే.. మేమున్నాని చెప్పుకునేందుకు జన సమీకరణ కోసం భారీగా ఖర్చు చేసిన పార్టీలు.. ఇప్పుడు అసలు యుద్ధం ప్రారంభించాయి....

మరో ఇద్దరు ఏపీ ఐఏఎస్‌లకు జైలు శిక్ష – సిగ్గు రాదా ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వాకాల గురించి గ్రంధాలు రాసినా తరగనంత సాహిత్యం పోగుపడిపోయింది. కోర్టుల దగ్గర ఉన్న ధిక్కార పిటిషన్లను లెక్కేసుకోవడానికి ఐదేళ్లు చాలవు. అతి కష్టం మీద తీర్పు వచ్చినా వాటిని అమలు...

ఏపీ సర్కార్ వారి డేటా ఎనలిటికల్ యూనిట్ – పెద్ద ప్లానే !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా డేటా ఎనలిటికల్ యూనిట్ ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏం డేటా ఎనలటిక్స్ చేస్తుందంటే... ఆదాయమంట. ఆదాయం ఎక్కడ తగ్గిపోయిందో గుర్తించి పెంచడానికి ఈ యూనిట్...

చంద్రబాబు బెయిల్ రద్దు కాలేదు సరి కదా సర్కార్‌కు సుప్రీం షరతు !

చంద్రబాబు జనాల్లోకి వస్తే తమ పరిస్థితి ఏమి అయిపోతుందోనని కంగారు పడిపోతున్న జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ సుప్రీంకోర్టులోనూ దాని కోసమే ప్రయత్నించారు. చంద్రబాబు రాజకీయ ర్యాలీలు, సమావేశాల్లో పాల్గొనకుండా షరతులు విధించాలని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close