గ్రేటర్ పోలింగ్ మొదలయింది

జి.హెచ్.ఎం.సి.ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఈరోజు ఉదయం 7గంటలకు మొదలయింది. సాయంత్రం 5గంటల వరకు సాగుతుంది. గ్రేటర్ పరిధిలో ఉన్న 150 మొత్తం 1,333 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో పరిధిలో మొత్తం 74 లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని, దానితో బాటే వారి పార్టీల భవితవ్యాన్ని ఈరోజు నిర్ణయిస్తారు. ఈ ఎన్నికల కోసం మొత్తం 7802 కేంద్రాలను ఏర్పాటు చేసారు. సాయంత్రం 5గంటల లోగా క్యూలో ఉన్నవారందరికీ ఎంత సమయం అయినా ఓటు వేసే అవకాశం ఉంటుంది.

ఎన్నికలు సజావుగా సాగేందుకు నగరమంతటా పటిష్టమయిన భద్రతా ఏర్పాట్లు చేసారు. సమస్యాత్మకమయిన ప్రాంతాలలో అదనపు బలగాలను మొహరించారు.ఈ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో మొత్తం 46, 545 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. 3,000 వెబ్ కెమెరాలు వినియోగించబడుతున్నాయి. ఈ ఎన్నికలలో గ్రేటర్ పరిధిలో ఉన్న ఓటర్లు అందరూ తమ ఓటు హక్కుని వినియోగించుకొనేందుకు ప్రభుత్వం ఈరోజు శలవు దినంగా ప్రకటించింది. గ్రేటర్ పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు, వాణిజ్య సంస్థలు, దుఖాణాలకు శలవు వర్తిస్తుంది.

ఈ ఎన్నికలలో తెరాస, కాంగ్రెస్, మజ్లీస్ పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. వాటిలో తెరాస మొత్తం 150 స్థానాలకు, కాంగ్రెస్ పార్టీ-149, మజ్లీస్-60స్థానాలలో పోటీ చేస్తున్నాయి.

ఈ ఎన్నికలలో కలిసి పోటీ చేస్తున్న తెదేపా-బీజేపీలు మొత్తం 150 స్థానాలకు పోటీ చేస్తున్నాయి. కానీ 12 స్థానాలలో మాత్రం రెండూ స్నేహపూర్వకంగా పోటీ పడుతున్నాయి. తెదేపా-95, బీజేపి-66 స్థానాల నుండి పోటీ చేస్తున్నాయి.

ఈ ఎన్నికలలో వామపక్షాలతో కలిసి లోక్ సత్తా పార్టీ పోటీ చేస్తోంది. వాటిలో లోక్ సత్తా-26, సి.పి.ఐ.-21, సిపిఎం-22, బీఎస్పి-55 స్థానాలకు పోటీ పడుతున్నాయి. ఈ ఎన్నికలలో మొత్తం 640 మంది స్వతంత్ర అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 5వ తేదీన వెలువడుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

ప్రచారంలో పొలిటికల్ గ్లామర్ ఏదీ..?

ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు....

ఎవరీ రామసహాయం రఘురామ్ రెడ్డి..?

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని హైకమాండ్ ప్రకటించింది.అనేకపేర్లు తెరమీదకు వచ్చినా అనూహ్యంగా అధిష్టానం రామసహాయం పేరును అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఈయన ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది....

“సివిల్ సర్వీస్” ఇమేజ్ జగన్ పాలనలో డ్యామేజ్ !

సివిల్ సర్వీస్ అధికారి అంటే ఓ గౌరవం.. ఓ మర్యాద. కానీ ఏపీలో సివిల్ సర్వీస్ అధికారులు చేస్తున్న పనులు చూసి.. కోర్టులు కూడా అసలు మీకెవరు ఉద్యోగం ఇచ్చారయ్యా అని అసహనపడాల్సి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close