సుప్రీంకోర్టు కూడా తప్పు ఒప్పుకొన్న వేళ…

దేశంలోకెల్లా అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు. దాని తీర్పుకు ఇక తిరుగు ఉండదు. కానీ అరుణాచల్ ప్రదేశ్ విషయంలో అది కూడా తప్పు చేసింది. దానిని నిజాయితీగా ఒప్పుకొని సరిదిద్దుకొంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర గవర్నర్ జ్యోతీ ప్రసాద్ రాజ్ ఖోవా నివేదిక ఆధారంగా రాష్ట్రపతి పాలన విదించబడటం, దానిని కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టులో సవాలు చేయడం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్ న్ని విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు కేంద్రప్రభుత్వానికి, గవర్నర్ రాజ్ ఖోవాకి దీనిపై సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేసింది. రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తూ గవర్నర్ కేంద్రానికి పంపిన నివేదికను కోర్టుకి సమర్పించాలని ఆదేశించింది.

దానిపై కేంద్రప్రభుత్వం తరపున వాదించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గీ, రాజ్యాంగంలోని 361వ అధికరణం క్రింద గవర్నరుకి రాజ్యాంగ పరమయిన ప్రత్యేక రక్షణ ఉంటుందని, కనుక సుప్రీం కోర్టు కూడా గవర్నర్లపై ఏవిధమయిన ఆదేశాలు చేయలేదని వాదించారు. ఆయన వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్ జెఎస్.ఖేహర్ నేతృత్వంలోని జస్టిస్ దీపక్ మిశ్ర, జస్టిస్ పి.సి.ఘోష్, జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ ఎం.బి.లోకుర్ లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గవర్నరుకి నోటీస్ ఇవ్వడం పొరపాటే అని అంగీకరించి, దానిని వాపసు తీసుకొంతున్నట్లు ప్రకటించింది. కానీ గవర్నర్ కి అభ్యంతరం లేకపోతే, ఈ వ్యవహారంలో తన నివేదికను, అభిప్రాయాలను సుప్రీం కోర్టుకి తెలియజేయవచ్చునని ధర్మాసనం తెలియజేసింది. రాష్ట్రపతి పాలన విధించిన తరువాత సచివాలయం, ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాల నుండి జప్తు చేయబడిన కొన్ని ఫైళ్ళను, లేఖలను మాజీ ముఖ్యమంత్రి నబం తుకికి, సదరు మంత్రులకు, పార్లమెంటరీ కార్యదర్శులకు వాపసు చేయాలని సుప్రీం కోర్టు కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close