జల్సాలు చూపిస్తూ.. అజ్ఞాతవాసంలో వేసేస్తాడా..? ఎవరు పూనం..?

పూనంకౌర్ … అప్పుడప్పుడూ ట్విట్టర్‌లో బాంబులేస్తూంటారు. ఆ ట్వీట్ టపాసులు ఎవరి మీద వేశారో అర్థమైనట్లు ఉంటుంది..కానీ క్లారిటీ ఉండదు. చాలా రోజులుగా ఇతే తంతు. కొద్ది రోజుల క్రితం.. ఇలాంటి ట్వీట్లు చేసి.. కాస్త వైరల్ అవుతూండగానే… డిలీట్ చేసేసేవారు. కానీ ఈ మధ్య అలా చేయడం లేదు. తను ట్వీట్లు చేస్తున్నారు. అంతే ఉంచుతున్నారు. గురువారం రాత్రి కూడా.. ఇలాంటి ట్వీట్లు ఆమె కలకలం రేపాయి. ఆ ట్వీట్లలో ఏమన్నారంటే.. సింపుల్‌గా ” జల్సాలు చూపిస్తూ.. ఆజ్ఞాతవాసంలో ఏసేస్తాడు.. జాగ్రత్త” అంటూ.. నమ్మకద్రోహి హ్యాష్ ట్యాగ్‌ను జత చేసింది. అంతలోనే ట్వీట్ వైరల్ అయిపోయింది. వేలల్లో రీట్వీట్లకెళ్లిపోయింది.

ఇంతకీ పూనంకౌర్ ఈ ట్వీట్లలో ఎవరికి నమ్మకద్రోహి బిరుదిచ్చారు..? జల్సాలు చేసి.. అజ్ఞాతవాసంలో వేసేసేది ఎవరు..? దీనిపై మాత్రం అటు పొలిటికల్ ఫ్యాన్స్..ఇటు సినీ ఫ్యాన్స్ కి క్లారిటీ వచ్చినట్లు వచ్చింది.కానీ రావడం లేదు. కొద్ది రోజుల క్రితం కూడా ఇలాంటి ట్వీట్లు చేసింది. ఓ దర్శకుడిని ఉద్దేశించి చేసిన ట్వీట్లు అవి. ఇప్పుడు దర్శకుడిని ఉద్దేశించి చేసినవా..? హీరోను ఉద్దేశించి చేసినవా అన్నదానిపై మాత్రం ఎవరికీ క్లారిటీ రావట్లేదు.

కొద్ది రోజుల కింద ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి చానల్‌కు ఇంటర్యూ ఇచ్చింది పూనంకౌర్. అందులో సిక్కు మహిళకు తనకెదురైన అన్యాయాల్ని ఎదుర్కొంటానని గట్టిగానే చెప్పింది. టాలీవుడ్‌లో తనకు చేదు జ్ఞాపకాలే ఉన్నాయని కూడా చెప్పుకొచ్చింది. తనను నమ్మించి మోసం చేసిన వారిని వదిలి పెట్టబోనని కూడా చెప్పుకొచ్చింది. ఆ ఇంటర్యూలో ఆంధ్రప్రేదశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును రెండు మూడు సార్లు ప్రశంసించింది కూడా. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం.. కాశీలో పూజలు చేసి… వార్తల్లోకెక్కారు. మొత్తానికి పూనం కౌర్ ట్వీట్లు, ఇంటర్యూలు చూస్తూంటే… ఆమె ఎప్పుడో ఓ సారి బ్లాస్టయ్యే అగ్నిపర్వతంలానే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ రోజూ ప్రచారానికి జగన్ బ్రేక్ – నిస్పృహ !

వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరాశ నిస్పృహల్లోకి చేరిపోయారు. ఆయన ప్రచారానికి ఆసక్తి చూపించడం లేదు. ఐదేళ్లు బయటకు రాకుండా ఉన్న ఆయనకు ఇప్పుడు నిరంతరాయంగా ప్రచారం చేయడం బద్దకంగా మారింది. ఓ...

నో వ్యాక్సిన్…ఇండియాలో వెస్ట్ నైల్ ఫీవర్ టెన్షన్..

కరోనా పీడ విరగడ అయిందని జనం రిలాక్స్ అవుతుండగా మరో కొత్త జ్వరం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కేరళలో వెలుగుచూసిన ఈ కొత్తరకం జ్వరం అక్కడి ప్రజలను వణికిస్తోంది. దీనికి వ్యాక్సిన్...

కూటమికి సంఘీభావం తెలుపుతూ జర్మనీలో ప్రవాసాంధ్రుల ర్యాలీ

మరో వారం రోజుల్లో (మే 13న) జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-భాజాపా కూటమికి సంఘీభావం తెలుపుతూ ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం, మే 5 తారీఖునాడు ఫ్రాంక్ఫుర్ట్ నగరంలో ప్రవాసాంధ్రులు ర్యాలీ...

సుకుమార్‌ని మోసం చేసిన దిల్ రాజు

సుకుమార్ సినిమా అంటే లాజిక్కుతో పాటు, ఐటెమ్ పాట‌లు గుర్తొస్తాయి. 'అ అంటే అమ‌లాపురం' ద‌గ్గ‌ర్నుంచి ఆయ‌న ప్ర‌భంజ‌నం మొద‌లైంది. 'ఊ అంటావా..' వ‌ర‌కూ అది కొన‌సాగుతూనే ఉంది. నిజానికి సుకుమార్‌కు ఐటెమ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close