మలయాళంలో సూపర్ హిట్టు కొట్టిన ప్రేమమ్ తెలుగులో రీమేక్ చేస్తున్నారనగానే చాలా సందేహాలొచ్చాయి. ఆ సినిమాలోని ఫీల్ని రీమేక్లో క్యారీ చేస్తారా అని అనుమానించారంతా. ఇప్పుడు ప్రేమమ్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే ప్రేమమ్లో ఫీల్ని 100 శాతం దింపకపోయినా తమ వంతు ప్రయత్నం మాత్రం చేశారని స్పష్టంగా అర్థమవుతోంది. 90 సెకన్ల పాటు సాగిన ట్రైలర్లో దాదాపు నిమిషం పాటు చైతూ డైలాగే వినిపిస్తోంది. ”ఈ ప్రపంచంలో ప్రతీ ప్రేమకథా మధురంగానే ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా అనిపిస్తుంది” అంటూ ఓ సుదీర్ఘమైన డైలాగ్ వినిపించాడు చైతూ. చివర్లో ‘మరో పెగ్గేద్దాం’ అంటూ దేవదాసు అవతారం కూడా ఎత్తాడు. చైతూ విషయానికొస్తే…. మూడు పాత్రల్లోనూ వైవిధ్యం చూపించాడు. ట్రైలర్ విజువల్ ఫీస్ట్లా అనిపించింది. మెలోడ్రామాకు చోటివ్వకుండా.. సినిమా అంతా హాయిగా సాయిపోయేలా చందూ మొండేటి తీర్చిదిద్దాడన్న భరోసా కలుగుతోంది. సినిమా కోసం ఖర్చు పెట్టిన ప్రతీ పైసా తెరపై కనిపిస్తోంది. పాటలు ఆల్రెడీ హిట్టయ్యాయి. సినిమా విడుదలయ్యాక జనంలోకి మరింత దూసుకెళ్లిపోయే అవకాశం ఉంది. మొత్తానికి ప్రేమమ్ ట్రైలర్ బోలెడన్ని ఆశల్నీ, అంచనాల్నీ పెంచేసింది. చైతూ ఆశలన్నీ… తీరే క్షణాలు దగ్గర పడుతున్నట్టే అనిపిస్తోంది. శ్రుతిహాసన్, మడోనా, అనుపమ పరమేశ్వరన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం అక్టోబరు 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.