ఉత్తరాఖండ్ హైకోర్టులో కేంద్రప్రభుత్వానికి ఎదురుదెబ్బ

ఉత్తరాఖండ్ హైకోర్టులో కేంద్రప్రభుత్వానికి ఈరోజు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్రంలో విదించిన రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తునట్లు ప్రకటించింది. అంతకు ముందున్న పరిస్థితిని ‘స్టేటస్ కో’ను పాటించాలని హైకోర్టు ఆదేశించింది. హరీష్ రావత్ మళ్ళీ ముఖ్యమంత్రి పదవి చేప్పట్టవచ్చని స్పష్టం చేసింది. ఆయనకు ఈనెల 29న శాసనసభలో మెజార్టీ నిరూపించుకొనేందుకు అవకాశం కూడా కల్పించింది. హరీష్ రావత్ తన ప్రభుత్వానికి శాసనసభలో మెజారిటీ ఉందని నిరూపించుకొనేందుకు ఆయనకు మళ్ళీ అధికారం చేపట్టే అవకాశం కల్పించడం చాలా అవసరమని చీఫ్ జస్టిస్ కె.ఎం.జోసఫ్, జస్టిస్ వి.కె.బిస్త్ లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి తిరుగుబాటు చేసిన 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడాన్ని హైకోర్టు గట్టిగా సమర్ధించింది. వాళ్ళు ‘రాజ్యాంగపరమయిన పాపం’ చేసినందుకు వారికి ఆ శిక్ష తగినదేనని చెప్పింది. అంతేకాదు కేంద్రప్రభుత్వం ఏదో ఒక సాకు చూపించి ఆర్టికల్ 356 ద్వారా తనకున్న విశేషాదికారాలతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విదించడం చాలా పొరపాటని అభిప్రాయం వ్యక్తం చేసింది.

విశేషమేమిటంటే కేంద్రప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై మళ్ళీ హైకోర్టునే స్టే మంజూరు చేయాలని కోరడం! అందుకు హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ “మేమిచ్చిన తీర్పుపై మేమే స్టే ఇవ్వలేము. మీరు కావాలనుకొంటే సుప్రీం కోర్టుకి వెళ్లి మా తీర్పుపై స్టే తెచ్చుకోవచ్చు,” అని స్పష్టం చేసింది.

హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు, అడ్డుదారిలో అధికారం చేజిక్కించుకొందామని ప్రయత్నించిన మోడీ ప్రభుత్వానికి చెంప దెబ్బ వంటిదేనని చెప్పవచ్చు. మోడీ ప్రభుత్వం హైకోర్టులో ఇంత అవమానకర పరిస్థితి ఎదుర్కోవలసి వచ్చింది కనుక, దాని తీర్పుని సుప్రీం కోర్టులో సవాలు చేసి స్టే కోరవచ్చు. కానీ అక్కడ కూడా మళ్ళీ ఎదురుదెబ్బ తగిలితే ఇంతకంటే అవమానకరంగా ఉంటుంది. ఒకవేళ సుప్రీం కోర్టు కూడా హైకోర్టు తీర్పుతో ఏకీభవిస్తూ కేంద్రప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తే అంతకంటే అప్రదిష్ట మరొకటి ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ‘లేడీస్ స్పెష‌ల్’

ముందు నుంచీ... విభిన్న‌మైన దారినే వెళ్తున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. త‌ను ఎంచుకొనే ప్ర‌తీ క‌థా... తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓవ‌ కొత్త జోన‌ర్ ని ప‌రిచ‌యం చేసింది. 'హ‌నుమాన్' తో పాన్ ఇండియా క్రేజ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close