మీడియా వాచ్ : ఆగిపోయిన ప్రైమ్ 9 న్యూస్..!

తెలుగు మీడియా రంగంలో పెట్టుబడులు పెట్టి రాజకీయంగా పలుకుబడి సంపాదించుకుందామని వచ్చేస్తున్న వారందరికీ… చేతి చమురు బాగానే వదులుతోంది. ఏంచేయాలో తెలియక చానెళ్లను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయే పరిస్థితి కనిపిస్తోంది. సిక్స్ టీవీ, ఏపీ24/7 లాంటి చానళ్ల ప్రసారాలు ఆగిపోయిన తర్వాత ఇప్పుడు ఆ వంతు ప్రైమ్ 9 న్యూస్ వంతు వచ్చింది. ఆ చానళ్ల ప్రసారాలు పూర్తిగా ఆగిపోయాయి. శాటిలైట్ ప్రసారాలు ఇవ్వాలంటే.. ఎర్త్ స్టేషన్ ఉన్న వారితో ఒప్పందం చేసుకోవాలి . అలా చేసుకున్న ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించకపోవడంతో వారు ప్రసారాలు నిలిపివేశారు.

ప్రైమ్ 9 న్యూస్ చానల్ అనేదాన్ని మొదట… జనసేనకు మద్దతుగా అంటూ ప్రారంభించారు. తర్వాత వైసీపీకి మద్దతుగా టోన్ మార్చారు. కానీ ఆ చానల్‌ను పట్టించుకున్న వారెవరూలేరు. మొదట్లో వైసీపీ భజన పరుడిగా పేరున్న జర్నలిస్ట్ సాయి ఈ చానల్‌లో కీలక పాత్ర పోషించారు. తర్వాత ఏం జరిగిందో కానీ ఆయన ఉన్నాడో లేదో తెలీనట్లుగా బండి నడుస్తోంది. సాయి సొంత చానల్ పెట్టుకుని ప్రభుత్వాన్ని పొగుడుతూ.. విపక్షాల్ని విమర్శిస్తూ.. వీడియోలు చేసుకుంటున్నారు.కానీ ప్రైమ్ 9న్యూస్ మాత్రం రోజు రోజుకు దిగజారిపోయింది.

బాబి ఆనంద్ అనే వ్యక్తి ఇప్పటి వరకూ సీఓఓగా వ్యవహరిస్తున్నారు. ఆయన నేతృత్వంలో చానల్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని చెబుతున్నారు. డబ్బులు తీసుకుని రిపోర్టర్ ఉద్యోగాలు ఇచ్చేవారన్న ప్రచారం కూడా ఉంది. ఇప్పుడుచానల్ ప్రసారాలు నిలిపివేయడంతో పెట్టుబడి పెట్టిన వారు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. వైసీపీకి మద్దుతుగా ఉంటున్నందున ఆ పార్టీకి చెందిన ఎవరినైనా బిగ్ షాట్‌ను పట్టుకుని బండి నడిపించాలన్న ఆలోచన చేస్తున్నారు. దానికి సాయి కరెక్టని అతన్నే అప్రోచ్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఇలా ఒడిదుడుకులు ఎదుర్కొన్న చానల్స్ నిలబడినట్లుగా చరిత్రలో లేదు కాబట్టి.. ప్రైమ్ 9 న్యూస్ కూడా… అత్యాశపరుల చేతుల్లో నలికిపోయిందని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close