పోలవరానికి, రాజధానికి ఇచ్చిన నిధులకి లెక్కలేవి? పురందేశ్వరి

ఆర్ధిక, రైల్వే బడ్జెట్ లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, రైల్వే జోన్ ఏర్పాటు, రాజధానికి, పోలవరం ప్రాజెక్టుకి నిధులు కేటాయించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆయనకి రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల కోరస్ పాడటం పూర్తయింది కనుక అటువైపు బీజేపీ నుండి దానికి కౌంటర్ ఇవ్వాల్సిన టైం వచ్చేసింది. అటువంటి పనిలో ఎప్పుడూ ముందుండే బీజేపీ జాతీయ మహిళా మోర్చా నేత పురందేశ్వరి ఆలస్యం చేయకుండా వెంటనే కౌంటర్ ఇచ్చేసారు.

పోలవరానికి బడ్జెట్ లో తగినన్ని నిధులు మంజూరు చేయలేదని విమర్శిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు దాని కోసం తీసుకొన్న నిధులకు లెక్క చెప్పాలని కోరారు. అసలు జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టులో కేంద్రం అనుమతి లేకుండా పట్టిసీమను అంతర్భాగంగా ఎందుకు చేర్చారని ఆమె ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టులో పట్టిసీమను చేర్చడం వలననే అది వివాదంగా మారిందని ఆమె అన్నారు. అయితే పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని శంఖించనవసరంలేదని అన్నారు. రాజధానికి తీసుకొన్న నిధులకు కూడా లెక్క చెప్పాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్రప్రభుత్వం దాని కోసం గత ఏడాది రూ.1500 కోట్లు విడుదల చేస్తే ఆ సొమ్ము అంతా ఏమయిందని ఆమె తెదేపా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఆ నిధులను తెదేపా ప్రభుత్వం వేరే అవసరాలకొ లేకపోతే దుబారా ఖర్చులు చేస్తోందనో ఆమె భావిస్తున్నట్లయితే, కేంద్రప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రిని వాటికి లెక్కలు, సమాధానం కోరవచ్చును. తాము భాగస్వామిగా ఉన్న తెదేపా ప్రభుత్వంపై మీడియా ద్వారా పురందేశ్వరి ఈవిధంగా అనుమానాలు వ్యక్తం చేయడం సరయిన పద్ధతి కాదు. అలాగే తెదేపా ప్రభుత్వం కూడా కేంద్రం మంజూరు చేస్తున్న ఆ నిధులకు లెక్కలు అప్పజెప్పకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని ఆరోపణలు చేయడం సరికాదు. రెండు పార్టీలు తమ తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు రాష్ట్రానికి నష్టం కలిగిస్తూ ఈ విధంగా ముసుగులో గుద్దులాడుకోవడం కూడా సరికాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ‘లేడీస్ స్పెష‌ల్’

ముందు నుంచీ... విభిన్న‌మైన దారినే వెళ్తున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. త‌ను ఎంచుకొనే ప్ర‌తీ క‌థా... తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓవ‌ కొత్త జోన‌ర్ ని ప‌రిచ‌యం చేసింది. 'హ‌నుమాన్' తో పాన్ ఇండియా క్రేజ్...

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close