ఇక డ‌బుల్ ఇస్మార్ట్‌కి రెడీ అయిపోవ‌చ్చా?

పూరికి ఎట్ట‌కేల‌కు ఓ హిట్టు ద‌క్కింది. అది అలాంటిలాంటి హిట్టు కాదు. బాక్సాఫీసు ద‌గ్గ‌ర మాస్‌ని ఊపేసే హిట్టు. తొలి రోజు వ‌సూళ్ల రేంజు చూస్తే… ఇస్మార్ట్ శంక‌ర్ సూప‌ర్ హిట్ ఖాతాలో చేరిపోతోందేమో అనిపిస్తోంది. మ‌రి పూరి త‌ర‌వాతి స్టెప్ ఎప్పుడు? ఎవ‌రితో..?? ఈ సినిమాతో పూరి ట్రాక్ ఎక్కేసిన‌ట్టేనా…?

ఎందుకైనా మంచిద‌ని ‘డ‌బుల్ ఇస్మార్ట్’ అనే టైటిల్‌, స్క్రిప్టు రెడీ చేసి పెట్టుకున్నాడు పూరి. అయితే ఈ సినిమా ఉంటుందా? ఉండ‌దా? అనేది ఇస్మార్ట్ శంక‌ర్ ఫ‌లితాన్ని బ‌ట్టే అన్న‌ది పూరికీ, రామ్‌కీ తెలుసు. అందుకే ఈమ‌ధ్య ఈ సినిమా సీక్వెల్ గురించి రామ్‌ని అడిగితే ‘ఇస్మార్ట్ శంక‌ర్ హిట్ట‌యితే సీక్వెల్ త‌ప్ప‌కుండా ఉంటుంది’ అని హింట్ ఇచ్చాడు. పూరీదీ అదే స‌మాధానం. ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ రిజల్ట్ చూసిన త‌ర‌వాత‌ రామ్‌, పూరి త‌ప్ప‌కుండా సీక్వెల్‌పై దృష్టి పెట్ట‌డం ఖాయం. పూరి ద‌గ్గ‌ర ఆల్రెడీ స్క్రిప్టు ఉంది. రామ్ కూడా ఎలాంటి క‌మిట్‌మెంట్సూ పెట్టుకోలేదు. కాబ‌ట్టి ఈ సినిమా వెంట‌నే ప‌ట్టాలెక్కేసినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ రిజ‌ల్ట్ చూసి పూరి ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌కి పోవాల్సిన అవ‌స‌రం కూడా లేదు. ఎందుకంటే స్క్రిప్టు ప‌రంగా ఇందులో చాలా త‌ప్పులున్నాయి. లాజిక్కుల‌కు దూరంగా క‌థ రాసుకున్నాడు. రామ్ ఎన‌ర్జీ, ఆ పాత్ర‌ని తీర్చిదిద్దిన విధానం ఈ సినిమాని నిల‌బెట్టాయి. ఆ విష‌యం పూరి తెలుసుకుని, సీక్వెల్‌లో కొన్ని త‌ప్పులు చేయ‌కుండా ఉంటే మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ కు బిగ్ షాక్…కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..?

పోలింగ్ కు ముందే బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలని , తమతో టచ్ లోనున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుకోవాలని కాంగ్రెస్ భావిస్తోందన్న చర్చ హాట్ టాపిక్ అవుతోంది. చేరికలకు సంబంధించి రాష్ట్ర...

కంచుకోటల్లోనే జగన్ ప్రచారం – ఇంత భయమా ?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలు గట్టిగా ముఫ్పై నియోజకవర్గాల్లో జరిగాయి. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు ఉంటే.. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కనీసం యాభై నియోజకవర్గాల్లో...

ఎలక్షన్ ట్రెండ్ సెట్ చేసేసిన ఏపీ ఉద్యోగులు !

ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్లు ఎవరూ ఎవరూ ఊహించని స్థాయిలో పెరిగాయి. గత ఎన్నికల కంటే రెట్టింపు అయ్యాయి. ఏపీలో మొత్తం దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు....

నేటితో ప్రచారానికి తెర…నేతల ప్రచార షెడ్యూల్ ఇలా

మరికొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5గంటలలోపే ప్రచారం ముగించాల్సి ఉండటంతో ఆయా పార్టీల అధినేతలు,అభ్యర్థులు మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close