ఆమాద్మీ బాటలో రాహుల్ గాంధీ

వచ్చే ఏడాది పంజాబ్, ఉత్తరప్రదేశ్ శాసనసభల ఎన్నికలు జరుగనున్నాయి. వాటి కోసం అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టాయి. డిల్లీకే పరిమితమైన ఆమాద్మీ పార్టీ పంజాబ్ కి కూడా పార్టీని విస్తరించే ప్రయత్నంలో ఆరేడు నెలల క్రితం నుంచే ఆ రాష్ట్రంపై దృష్టి పెట్టి పనిచేయడం మొదలుపెట్టింది. ఆ రాష్ట్రంలో ప్రధాన సమస్య మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వ్యాపారం అని మొదట గుర్తించినది ఆమద్మీ పార్టీయే. అందుకే తమ పార్టీ అధికారంలోకి వస్తే వాటిని అరికడతామని ఆ పార్టీ హామీ ఇస్తోంది.

ఇటీవల ‘ఉడ్తా పంజాబ్’ అనే సినిమా వచ్చింది. దానిపై ప్రస్తుతం చాలా వివాదం ఏర్పడింది. అది వేరే సంగతి. పంజాబ్ ని చిరకాలంగా పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాల సమస్యలని ఆ సినిమాలో చూపించారు. అంటే ఆ సమస్య తీవ్రత ఎంతగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఈ సమస్యపై పోరాటంలో ఆమాద్మీ పార్టీ తమ కంటే ముందున్నట్లు గుర్తించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, దానిపై సమరశంఖం పూరించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ మాదకద్రవ్యాల సమస్య, ఆ కారణంగా రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలను నిరసిస్తూ ఆయన ఈ నెల 13న జలంధర్ లో ఒక్కరోజు ధర్నా చేయబోతున్నారు.

నిజానికి పంజాబ్ లో ఈ సమస్య చాలా దశాబ్దాలుగా నెలకొని ఉంది. కానీ దానిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నడూ పెద్దగా పట్టించుకోలేదు. ఆ కారణంగానే అది నేడు ఒక మహాసామ్రాజ్యంలాగ విస్తరించిపోయి, బలమైన పంజాబ్ సామాజిక వ్యవస్థని చెదపురుగులా దొలిచేస్తూ బలహీనపరుస్తోంది.

ఆ సమస్యని గుర్తించిన ఆమాద్మీ దాని నివారణకి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుందో లేదో తెలియదు కానీ దానిని రాబోయే ఎన్నికలలో ప్రధానాస్త్రంగా వాడుకోవచ్చని గ్రహించింది. దానితో ఆమాద్మీ ఎక్కడ లాభపడిపోతుందోననే ఆలోచనతో రాహుల్ గాంధీ కూడా ధర్నాకి సిద్దం అయిపోతున్నారు. ఉడ్తా పంజాబ్ సినిమాతో ఆ సమస్య ఇంకా హైలైట్ అయ్యింది కనుక బహుశః భాజపాతో సహా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇక దానిపై పోటాపోటీగా ఉద్యమించడం మొదలుపెట్టినా ఆశ్చర్యం లేదు. సమాజానికి హాని కలిగిస్తున్న ఒక తీవ్రమైన సమస్య పరిష్కారం కోసం నిజాయితీగా కృషి చేయవలసిన రాజకీయ పార్టీలు, దానిని తమ రాజకీయ లబ్ధికి పనికివచ్చే అస్త్రంగా మాత్రమే చూడటం చాలా శోచనీయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close