చంద్రబాబు మాజీ పీఏపై కేంద్ర సంస్థల దర్యాప్తు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద చాలా కాలం పాటు పర్సనల్ అసిస్టెంట్‌గా పని చేసిన పెండ్యాల శ్రీనివాస్ అనే ఏపీ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు చేపట్టారు. దర్యాప్తు చేస్తున్న ఇన్‌కంట్యాక్స్ అధికారులా.. లేక మరో దర్యాప్తు సంస్థకు చెందిన వారా..అన్న క్లారిటీ లేదు. రాష్ట్ర పోలీసు అధికారులకు కూడా సమాచారం లేదు. భద్రతగా కూడా… సీఆర్‌పీఎఫ్ బలగాలను తెప్పించుకున్నారు. చాలా కాలం పాటు చంద్రబాబు వద్ద పీఏగా పని చేసినఆయన తర్వాత రిలీవ్ అయ్యారు. ప్రస్తుతం జీఏడీలో స్టాటిస్టికల్‌ అధికారిగా ఉన్నారు.

విజయవాడ సిద్దార్ధనగర్‌లో ఉన్న ఇంట్లోతో పాటు ఆయనకు సంబంధించిన ఇళ్లలో కూడా.. ఈ సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అత్యంత రహస్యంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. ఇంటి బయట దృశ్యాలను చిత్రీకరించడానికి కూడా భద్రతా సిబ్బంది అంగీకరించలేదు. మొదట.. అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారేమోనన్న ప్రచారం జరిగింది. కానీ తాము సోదాలు చేయడం లేదని ఏసీబీ అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో అసలు పెండ్యాల శ్రీనివాస్ ఇంటిపై దాడులు చేసి సోదాలు చేస్తోంది కేంద్ర దర్యాప్తు సంస్థలన్న విషయం మాత్రం క్లారిటీ వచ్చింది. సాధారణంగా అవినీతి పరమైన అంశాలు.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు.. అన్నీ ఏపీ ప్రభుత్వ పరిధిలోని ఏసీబీలోకే వస్తాయి.

కానీ.. ఇక్కడ రంగంలోకి దిగింది కేంద్ర దర్యాప్తు సంస్థలు. ఏ అంశంపై ఇలా సోదాలు చేస్తున్నారన్నదానిపై చిన్న విషయం కూడా బయటకు రావడం లేదు. పెండ్యాల శ్రీనివాస్.. చంద్రబాబు దగ్గర పీఏగా పని చేయడం.. తాజా రాజకీయ పరిణామాల నేపధ్యలో నేరుగా కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగడంతో… ఏదో రాజకీయ సంచలనం ఉండబోతోందన్న చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది. సోదాలపై సంబంధిత సంస్థ అధికారిక ప్రకటన చేస్తేనే కానీ క్లారిటీ రాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close