ప్ర‌భాస్‌కి దూర‌దృష్టి ఎక్కువ‌: రాజ‌మౌళి కితాబు

ప్ర‌భాస్ – రాజ‌మౌళిల బంధం విడ‌దీయ‌లేనిది. ఛ‌త్ర‌ప‌తి లాంటి మాస్ హిట్ ఇచ్చి, మాస్ హీరోగా ప్ర‌భాస్‌ని ఎక్క‌డో కూర్చోబెట్టాడు రాజ‌మౌళి. ఇక బాహుబ‌లి గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌రో పాతికేళ్ల‌యినా ఈ సినిమా గురించి సినీ ప్ర‌పంచం మాట్లాడుకుంటూనే ఉంటుంది. ప్ర‌భాస్ వేడుక అంటే రాజ‌మౌళి రాకుండా ఎలా ఉంటాడు? సాహో ప్రీ రిలీజ్ వేడుక‌కు రాజ‌మౌళినే ప్ర‌త్యేక అతిథి. ఈ వేడుక‌లో మ‌రోసారి ప్ర‌భాస్ – రాజ‌మౌళి మ‌ధ్య అనుబంధం ఆవిష్కృత‌మైంది. ప్ర‌భాస్‌, రాజ‌మౌళి ఇద్ద‌రూ పాత స్నేహితులు మ‌ళ్లీ క‌లుసుకున్న రేంజులో.. హాయిగా న‌వ్వుతూ, తుళ్లుతూ మాట్లాడుకోవ‌డం ఆక‌ట్టుకుంది.

రాజ‌మౌళి మాట్లాడుతూ ”ప్ర‌తీ హీరో అభిమాని…తమ హీరో సినిమా హిట్ట‌వ్వాల‌ని కోరుకుంటాడు. కానీ.. అంద‌రు అభిమానులూ ప్ర‌భాస్ సినిమా హిట్ట‌వ్వాల‌ని కోరుకుంటారు. ప్ర‌భాస్ పాజిటీవ్ థింకింగ్ వ‌ల్ల ఇంత మంది అభిమానులు ప్ర‌భాస్‌కి ఏర్ప‌డ్డారు. ప్ర‌భాస్‌కి దూర‌దృష్టి ఎక్కువ‌. బాహుబ‌లి స‌మ‌యంలోనే త‌ర‌వాత ఎలాంటి సినిమా చేయాలా? అని ఆలోచించాడు. బాహుబ‌లి హిట్ట‌వుతుంద‌ని త‌న‌కు ముందే తెలుసు. ఆ త‌ర‌వాత సినిమా కూడా అదే స్థాయిలో ఉండాల‌ని త‌ప‌న ప‌డ్డాడు. ఓరోజు నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి `సుజిత్ మంచి క‌థ చెప్పాడు డార్లింగ్ అదిరిపోయింది` అన్నాడు. బాహుబ‌లి త‌ర‌వాత మ‌రో పెద్ద ద‌ర్శ‌కుడితో సినిమా చేయ్యొచ్చు. కానీ సుజిత్‌ని న‌మ్మి, తాను చెప్పిన క‌థ‌ని న‌మ్మి ఈ సినిమా చేశాడు. బాహుబ‌లి త‌ర‌వాత ఇలాంటి సినిమా తీస్తే జ‌నాల‌కు న‌చ్చుతుంద‌ని న‌మ్మాడు. రెండో సినిమాకి ఇంత పెద్ద బాధ్య‌త‌ని హ్యాండిల్ చేయ‌గ‌ల‌డా? లేడా? అని సుజిత్‌పై చాలామంది డౌటు ప‌డ్డారు. ఫ‌స్ట్ లుక్ కి ఆ అనుమానాలు కాస్త త‌గ్గాయి. ట్రైల‌ర్‌కి ప‌టాపంచ‌లైపోయాయి. ప్ర‌భాస్ ఎప్పుడో నేష‌న‌ల్ స్టార్ అయిపోయాడు. ఈసినిమాతో త‌ను మ‌రింత ముందుకు వెళ్లాల‌”న్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close