నూర్ మహ్మద్ కుటుంబానికి మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ రూ.10 లక్షల విరాళం

నెల రోజుల క్రితం హైదరాబాద్‌ సిటీ చిరంజీవి యువత అధ్యక్షులు నూర్ మహ్మద్ గుండెపోటుతో మృతి చెందిన విషయం విదితమే.

ఆ వార్త తెలిసిన వెంటనే మెగాస్టార్‌ చిరంజీవి గారు సికింద్రాబాద్‌లోని వారి ఇంటికి స్వయంగా వెళ్ళి కుటుంబ సభ్యులను ఓదార్చి వచ్చారు. అప్పట్లో విదేశాలలో ఉన్న రామ్‌చరణ్‌ తను హైదరాబాద్ రాగానే నూర్ మహ్మద్ కుటుంబాన్ని కలుస్తానని, ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని మాట ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజు (ఆదివారం) ఉదయం నూర్ మహ్మద్ కుటుంబ సభ్యులను రామ్ చరణ్ గారు ఇంటికి పిలిపించుకొని 10లక్షల రూపాయల చెక్కు ను వారికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులు ఆనందానికి అవధుల్లేవు. ఈ సహాయం మరువలేనిదని, ఎన్నటికీ రుణపడి ఉంటామని ఆ కుటుంబ సభ్యులు రామ్‌చరణ్‌తో అన్నారు.

‘నూర్ మహ్మద్ తమ కుటుంబం పేరుతో చేసిన సేవలు ఎనలేనివి. ముఖ్యంగా ఆయన చేసే కార్యక్రమాలు మేము చూడాలని, మాకు తెలియాలని ఎప్పుడు కోరుకోకుండా మా పుట్టినరోజులకు, సినిమా ఫంక్షన్లకు అనేక సేవా కార్యక్రమాలు చేశారు అని రామ్ చరణ్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులతో ముచ్చటించారు.

దాదాపు 45 నిముషాలు నూర్ మహ్మద్ కుటుంబంతో గడిపారు. ఆయన చేసిన సేవలను రామ్ చరణ్ విశేషంగా కొనియాడారు.

నూర్ మహ్మద్ గారిని తిరిగి తీసుకొని రాలేనని, కానీ మీ ఇంటిలో పెద్ద కొడుకులా మీకు అండగా ఉంటానని, అదే విధంగా నూర్ మహ్మద్ గారి కుమారుడికి మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తానని , అంతే కాకుండా అమ్మాయిల పెళ్లిళ్లకు తను స్వయంగా వస్తానని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు


Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close