రమేష్ హాస్పిటల్ తరఫున హీరో రామ్ వకాల్తా, సోనూసూద్ ని చూసి నేర్చుకోమంటున్న నెటిజన్లు

హీరో రామ్ పోతినేని, “ఇది స్వాతంత్ర దినోత్సవమా లేక స్వర్ణా ప్యాలెస్ సంఘటనకు సంబంధించిన దినమా” అంటూ ప్రశ్నించడమే కాకుండా ఈ ఘటన విషయంలో ముఖ్యమంత్రి జగన్ ని అప్రతిష్టపాలు చేసే కుట్ర దాగి ఉందేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. ఫైర్ సేఫ్టీ వంటి విషయాలు స్వర్ణ ప్యాలెస్ హోటల్ కి సంబంధించినవే కానీ, వీటితో రమేష్ హాస్పిటల్ కి ఏమి సంబంధం అంటూ ప్రశ్నిస్తూ ఆయన ట్వీట్ చేయడం కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే..

హీరో రామ్ ట్వీట్ చేస్తూ,”హోటల్ స్వర్ణ ప్యాలస్ ని రమేష్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్ గా మార్చక ముందు , ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది. అప్పుడీ అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లు ? ఫైర్ + ఫీజు ‌= ఫూల్స్ అంద‌రినీ ఫూల్స్ చేయ‌డానికే విష‌యాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మ‌ళ్లిస్తున్నారా?

ఫీజుల‌ వివ‌ర‌ణ‌: మేనేజ్‌మెంట్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్న స్వ‌ర్ణ‌ప్యాలెస్‌ డైరెక్ట్ గా బిల్లింగ్ చేసింది. ‌పెద్ద కుట్ర జ‌రుగుతున్న‌ట్టుంది!! సీఎంని త‌ప్పుగా చూపించ‌డానికి! @ysjagan garu.మీ కింద ప‌ని‌చేసే కొంత‌మంది మీకు తెలియ‌కుండా చేసే కొన్ని ప‌నుల వ‌ల్ల మీ రెప్యుటేష‌న్ కీ‌,మీ మీద మేం పెట్టుకున్న న‌మ్మ‌కానికి డ్యామేజ్ కలుగుతోంది.వాళ్ల మీద ఓ లుక్కేస్తార‌ని ఆశిస్తున్నాం” అని రాసుకొచ్చారు.

అయితే రామ్ ట్వీట్ పై నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. ముఖ్యంగా, రమేష్ హాస్పిటల్ తన బంధువుల కి సంబంధించినది కావడంతోనే రామ్ స్పందిస్తున్నారని, రామ్ ట్వీట్ అంతా రమేష్ హాస్పిటల్ ని కాపాడడం పై ఫోకస్ చేసినట్లుగా ఉంది తప్పించి బాధితులకు న్యాయం జరిపించమని ఎక్కడా ప్రస్తావించలేదని వారంటున్నారు. తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు వేసుకునే సోనూసూద్ నుండి రామ్ వంటి హీరోలు నేర్చుకోవాలని, విలన్ పాత్రలు చేసిన ఆయన తనకు ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా గత కొద్ది నెలల్లో కోట్లు ఖర్చు పెడుతుంటే రామ్ వంటి హీరోలు, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కూడా తమ బంధువులని కాపాడడానికి మాత్రమే ముందుకు వస్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

ఈ విమర్శలపై రామ్ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close