తెలుగు మీడియంలో చదువుకోవడం అంటరానితనమా..!?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తెలుగు భాషలో చదవుకోవడాన్ని అంటరానితనంగా చెప్పడం కలకలం రేపుతోంది. ” విద్యాపరంగా అంటరానితనాన్ని పాటించాల్సిందనే వాదనలు.. మరో రూపంలో ఇప్పుడు వినిపిస్తున్నాయని.. మా పిల్లల్ని, మనుమల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తాం… పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవడానికి వీల్లేదనే వాదన చేస్తున్నారని.. ఇలా వాదించడం ద్వారా వారు.. రూపం మార్చుకున్న అంటరానితనాన్ని బాహాటంగా ప్రదర్శిస్తున్నారు.. దీనిని మేము సమర్దించలేం” అని జగన్ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో చెప్పుకొచ్చారు.

ఆయనకు క్రియేటివ్‌గా ఉందని ఎవరైనా రాసిచ్చారో.. లేక స్వయంగా రాసుకుని వచ్చి చదివారో కానీ ముఖ్యమంత్రి నోటి వెంట వచ్చిన ఆ మాటలు విని భాషా ప్రేమికులు ఉలిక్కి పడ్డారు. తెలుగు మీడియంను రద్దు చేస్తూ.. ఒక్క ఇంగ్లిష్ మీడియం మాత్రమే ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అది రాజ్యాంగపరంగా చెల్లుబాటు కాదని..ఏ మీడియంలో చదవుకోవాలనేది విద్యార్థులు, తల్లిదండ్రుల ఇష్టమని కోర్టు ఆ జీవోలను కొట్టి వేసింది. కేంద్రం కూడా.. కొత్త విద్యా విధానాన్ని ప్రకటించి ఐదో తరగతి వరకు మాతృభాషను తప్పనిసరి చేసింది.

అయితే.. కోర్టుల తీర్పులను పట్టించుకోని ఏపీ ముఖ్యమంత్రి… కేంద్ర విద్యా విధానాన్ని లెక్కలోకి తీసుకోవడం లేదు. పైగా ఎదురుదాడికి సిద్దమయ్యారు.

ఏపీలో ఇంగ్లిష్ మీడియం పెట్టవద్దని ఎవరూ చెప్పడం లేదు. తెలుగు మీడియం కూడా ఉంచితే.. విద్యార్థులు, తల్లిదండ్రులు వారికి ఇష్టమైన మాధ్యమంలో చదవుకుంటారని అంటున్నారు. కానీ పూర్తిగా రాజకీయ కోణంలో… ప్రజల్ని రెచ్చగొట్టే ఉద్దేశంతో.. ఇంగ్లిష్ మీడియాన్ని వద్దంటున్నారంటూ… రాజకీయ పార్టీలు, కోర్టులు.. చివరికి కేంద్రంపైనా.. ప్రజల్ని రెచ్చగొట్టేందుకు మఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

తెలుగు భాషను నేర్చుకోవడం… తెలుగు మీడియంలో చదువుకోవడం అంటరానితనమన్నట్లుగా జగన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తప్పు పట్టారు. అమరావతి శిలాఫలకంలో తెలుగులో పేర్లు లేవని అరచి గోల పెట్టిన వారు ఇప్పుడెక్కడున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close