సీఎం జగన్‌కు రమణదీక్షితులు ఫైనల్ ” రిమైండర్ “

రమణదీక్షితులు రాజకీయంలో పావుగా మారి తన పదవిని పోగొట్టుకుని ఐదేళ్లు అవుతోంది. అందు కోసం క్రిస్టియన్ సంఘాల నేత అయిన బోరుగడ్డ అనిల్ తోనూ కలిసి పని చేశారు. తాను పదవిలోకి రాగానే మళ్లీ ప్రధాన అర్చక పదవిని ఇస్తానని జగన్ రెడ్డి దగ్గర…. హైదరాబాద్ లోటసా పాండ్‌లో శిలువ గుర్తు ఉన్న ఇంటి కింద ప్రామిస్ కూడా తీసుకున్నారు. కానీ ఆయనకు ఇప్పటి వరకూ హామీ నెరవేరలేదు. దీంతో సందర్భం వచ్చినప్పుడల్లా ట్వీట్లు పెడుతున్నారు.

జగన్ రెడ్డి పదవి కాలం పూర్తయ్యే సమయం దగ్గర పడటంతో తనకిచ్చిన హామీని మరోసారి రమణదీక్షితులు ట్విట్టర్ వేదికగా గుర్తు చేశారు. జస్టిస్ శివశంకర్ రావు కమిటీ నివేదికను అమలు చేయాలని కోరారు. టీటీడీని ప గ, ప్రతీకారాలతో నాశనం చేస్తున్నారని…. జగన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలని ఆయన సూచించారు. రమణదీక్షితుల పింక్ డైమండ్, పోటులో తవ్వకాల ఆరోపణలు చంద్రబాబు ప్రభుత్వానికి గట్టిగానే తగిలాయి. ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా అవన్నీ ఉత్తుత్తి ఆరోపణలేనని నిజం లేదని తేల్చింది. తప్పుడు ఆరోపణలు చేసి వైసీపీకి లబ్ది చేకూర్చిన రమణదీక్షితులు మాత్రం ఇప్పటికీబాధితులుగానే ఉండిపోయారు.

ఆయనకు తన ప్రధాన అర్చక పదవి ఇస్తారనుకుంటే.. ప్రతీ సారి ఓ పని లేని పదవిని జీవో రూపంలో ఇస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ప్రస్తుతం లఆయన శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు హోదాలో ఉన్నారు. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. తనపదవి తనకు వచ్చేలా చేయడానికి వంశపారం పర్య అర్చకుల సమస్యకు పరిష్కారం దొరకాలని ఆయన అంటున్నారు. వంశపారం పర్య అర్చకుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ శివశంకర్ కమిటీ నివేదికను బయట పెట్టాలని ఆయన కోరుతున్నారు. నేరుగాజగన్ అపాయింట్ మెంట్ దొరకడం ఇప్పుడు సాధ్యం కాబట్టి ఆయన ట్విట్టర్ ద్వారా వేడుకుంటున్నారు. కానీ పట్టించుకునేవారేలేరు. ప్రభుత్వం మారితే తన పరిస్థితేమిటని ఆయన ఆందోళన చెందుతున్నట్లుగా కనిపిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అందర్నీ గొడ్డలితో నరికేసి సింగిల్ ప్లేయర్ అవ్వండి – భారతికి షర్మిల సలహా

వైఎస్ జగన్, ఆయన సతీమణిపై వైఎస్ షర్మిలారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బధవారం మీడియాతో మాట్లాడిన షర్మిల వైసీపీ వాళ్లే అధికారంలో ఉండాలి... వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వారందర్నీ...

విజ‌య్ సినిమాల‌కు టైటిళ్లు కావ‌లెను!

రేపు.. అంటే మే 9న విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా విజయ్ కొత్త సినిమాల సంగ‌తులు రేపే రివీల్ కాబోతున్నాయి. మైత్రీ మూవీస్ లో విజ‌య్ ఓ సినిమా చేస్తున్నాడు....

మొదటిసారి కాంగ్రెస్ ట్రాప్ లో మోడీ..!?

ఇన్నాళ్ళు పదునైన విమర్శలతో కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టేసిన ప్రధాని మోడీ మొదటిసారి కాంగ్రెస్ ట్రాప్ లో పడినట్లుగా కనిపిస్తోంది. ప్రతి ఎన్నికల ప్రచార సభలో రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తుండటంతో మోడీ కాంగ్రెస్...

‘మిరాయ్’ నుంచి మ‌రో స‌ర్‌ప్రైజ్‌

'హ‌నుమాన్‌' త‌ర‌వాత తేజా స‌జ్జా నుంచి వ‌స్తున్న సినిమా 'మిరాయ్‌'. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవ‌లే టీజ‌ర్ విడుద‌ల చేశారు. టీజ‌ర్‌లోని షాట్స్,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close