రమణదీక్షితులు తొలి సలహా..? శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు..!?

తిరుమల శ్రీవారికి సంబంధించిన కొన్ని కీలకమైన ఆర్జిత సేవలు రద్దు చేయాలని టీటీడీ నిర్ణయించింది. వసంతోత్సవాలు, విశేషపూజ, కలశాభిషేకం సేవల రద్దు చేయనున్నారు. ఈ మేరకు టీటీడీకి ఆగమ పండితుల సూచించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆగమ సలహాదారుగా … కొద్ది రోజలు కిందటే.. మాజీ ప్రధానార్చకులు రమణదీక్షితులు బాధ్యతలు చేపట్టారు. కొద్ది రోజుల్లోనే… ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. దీనికి కారణం.. బింభ పరిరక్షణ కోసమేనని చెబుతున్నారు. 600 ఏళ్ల క్రితం లభించిన మలయప్పస్వామి బింభ పరిరక్షణ కోసం.. ఈ ఆర్జిత సేవలు రద్దు చేయాలని టీటీడీ ఆగమసలహామండలి సూచించినట్లుగా… ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ప్రతి నిత్యం స్నపన తిరుమంజనం నిర్వహిస్తే.. బింభం అరుగుదల సంభవిస్తుందని ఆగమపండితులు నివేదిక ఇచ్చారట. ఇకపై ఏడాదికి ఒక రోజు వసంతోత్సవాలు, సహస్ర కలశాభిషేకం.. విశేష పూజలు నిర్వహిస్తే చాలని.. వారు చెప్పారంటున్నారు. తిరుమలలో ఏదైనా ఆగమ పండితుల సలహా మేరకే జరుగుతుంది. అయితే.. అనూహ్యమైన నిర్ణయాలు తీసుకోవడం …భక్తుల మనోభావాలకు విరుద్ధంగా.. వ్యవహరించే పనిని ఆగమ సలహామండలి కూడా చేయదు.

దశాబ్దాలుగా.. శ్రీవారికి అత్యంత ఇష్టమైనవిగా చెప్పుకునే వసంతోత్సవాలు, విశేషపూజ, కలశాభిషేకంలను.. కేవలం బింభం అరుగుదలను కారణంగా చూపి.. నిలిపివేయాలని నిర్ణయించడమే ఆసక్తికరం. జగన్ కోసం ..।శ్రీవారికి పాద పూజ చేస్తానంటూ.. బహిరంగంగా ప్రకటించుకున్న… రమణదీక్షితులు ఇప్పుడు ఆగమసలహాదారుగా ఉండటం.. ఈ నిర్ణయానికి మరింత వివాద కోణం జత చేసే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

సీఎస్, డీజీపీ బదిలి ఇంకెప్పుడు !?

ఏపీలో వ్యవహారాలన్నీ గీత దాటిపోతున్నాయి. ఎన్నికలకోడ్ ఉన్నా.. రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఐపీసీ సెక్షన్ల కాకుండా జేపీసీ సెక్షన్లతో పోలీసులు రాజకీయ కేసులు పెట్టేస్తున్నారు. అమాయకుల్ని బలి చేస్తున్నారు. మరో...

ఎక్స్ క్లూజీవ్: మారుతి నుంచి ‘బేబీ’లాంటి ‘బ్యూటీ’

గ‌తేడాది వ‌చ్చిన సూప‌ర్ హిట్ల‌లో 'బేబీ' ఒక‌టి. చిన్న సినిమాగా వ‌చ్చి, సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకొంది. నిర్మాత‌ల‌కు, పంపిణీదారుల‌కూ విప‌రీత‌మైన లాభాల్ని పంచిపెట్టింది. ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా...

కాళ్లు పట్టుకోవడంలో పెద్దిరెడ్డి ఎక్స్‌పర్ట్ – కిరణ్ చెప్పిన ఫ్లాష్ బ్యాక్ !

కిరణ్ కుమార్ రెడ్డికి.. పెద్దిరెడ్డికి రాజకీయ వైరం దశాబ్దాలుగా ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. ఒకే పార్టీలో ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డిపై పెద్దిరెడ్డికి వ్యతిరేకత ఉంది. కానీ తాను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close