శ్రీవారి దర్శనాలపై టీటీడీ వర్సెస్ రమణదీక్షితులు..!

తిరుమల, తిరుపతిల్లో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో శ్రీవారి దర్శనాల నిలిపివేత అంశం మరో సారి హాట్ టాపిక్ అయింది. భక్తుల వద్ద నుంచి ఎలాంటి డిమాండ్లు లేవు. దర్శనాలకు యథావిధిగా భక్తులు వస్తున్నారు. అయితే.. అనూహ్యంగా శ్రీవారి గౌరవ ప్రధాన అర్చకులు.. రమణదీక్షితులు.. దర్శనాలు రద్దు చేయాలనే డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చారు. శ్రీవారికి కైంకర్యాలు నిర్వహించే 50 మంది అర్చకుల్లో 15 మంది అర్చకుల‌కు కరోనా సోకిందని.. మ‌రో 25 మంది అర్చకుల టెస్టుల రిజల్ట్ రావాల్సి ఉందన్నారు. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. శ్రీవారి దర్శనం నిలిపివేయకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. టీటీడీ ఈఓ, అదనపు ఈఓ వ్యవహారశైలి అర్చకులకు వ్యతిరేకంగా ఉందన్నారు.

రమణదీక్షితులు చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తిరుమలలో దర్శనాలను నిలిపివేయబోమని ప్రకటించారు. అన్నమయ్య భవన్లో అర్చకులు సమీక్ష నిర్వహించారు. పూజా కైంకర్యాలకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగుల్లో 140 మంది వరకూ కరోనా సోకినా.. సగానికి సగం మంది కోలుకున్నారన్నారు. దర్శనాలు నిలిపివేసే ప్రసక్తే కాదని స్పష్టం చేశారు.

రమణదీక్షితులు ఏం కోరుతున్నారో .. ప్రభుత్వ పెద్దలకు ఆయనకు అది ఇవ్వలేకపోతున్నారు. ఆలయంపై ఆయన పెత్తనం సాగడం లేదు. అందుకే.. ఇలా సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఐవైఆర్ కృష్ణారావు, సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ట్వీట్లను.. రీట్వీట్ చేస్తూ.. తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. మాట తప్ప.. మడమ తిప్పం అనేది ప్రజలను మభ్య పెట్టడానికేనని.. ఐవైఆర్ కృష్ణారావు చేసిన ట్వీట్‌ను రమణదీక్షితులు రీ ట్వీట్ చేశారు. ఇలా వరసుగా.. రణదీక్షితులు.. అవకాశం దొరికినప్పుడల్లా.. ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close