కరోనా రాని వాళ్లెవరూ ఉండరు : జగన్

భవిష్యత్‌లో కరోనా వైరస్ సోకని వాళ్లు ఎవరూ ఉండదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. ప్రస్తుతం కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయని.. ఎవరూ వాటిని ఆపలేరని వ్యాఖ్యానించారు. కరోనా ఆపడానికి చేసే ప్రయత్నాల కన్నా.. వచ్చిన తర్వాత.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు చెప్పడమే మంచిదన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేస్తున్నారు. కరోనా సోకినప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి… ఏం చేయాలన్నదానిపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వైరస్ సోకిన తర్వతా మందులు తీసుకుంటే తగ్గిపోతుందన్నారు. 85 శాతం మంది ఇళ్లలోనే ఉంటూ నయం చేసుకుంటున్నారని.. 15 శాతమే ఆసుపత్రులకు వస్తున్నారన్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకూ కొవిడ్తో కలిసి జీవించాల్సిందేనని సీఎం మరోసారి స్పష్టం చేశారు.

లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కరోనా నివారణ చర్యలపై ఏపీ ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టలేదు. దాంతో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఎక్కడికక్కడ కోవిడ్ ఆస్పత్రులు… క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నప్పటికీ.. రోగుల సంఖ్య పెరిగిపోతూండటంతో.. వైద్యం అందించడం కూడా కష్టతరంగా మారుతోంది. ఏపీలో ఎక్కువగా మధ్య తరగతి కుటుంబాలే ఉంటాయి. ప్రత్యేకంగా కుటుంబసభ్యులకు గదులు ఉండటం చాలా తక్కువ. దీంతో హోం ఐసోలేషన్ కూడా సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో.. ప్రభుత్వం.. కరోనా కట్టడి కన్నా.. సోకిన వారికి వైద్యం అందించడానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తోంది. ముఖ్యమంత్రి అభిప్రాయం కూడా అంతే ఉంది.

మరో వైపు.. రోజుకు 40కి పైగా.. మరణాలు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య రెండున్నర వేలు దాటిపోయింది. గత ఇరవై నాలుగు గంటల్లో 22వేలకుపైగా శాంపిల్స్ పరీక్షించంగా 2593 మందికి పాజిటివ్ సోకినట్లుగా నిర్ధారణ అయింది. అంటే.. దాదాపుగా ప్రతి వంద మందిలో పదకొండు మందికి కరోనా వైరస్ సోకిందని అర్థం. అదే సమయంలో.. మరణాలు కూడా ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. నాలుగు రోజుల కిందట వరకూ.. రోజుకు పదిలోపే ఉండే మరణాలు ఇప్పుడు.. సగటున నలభై పైనే నమోదవుతున్నాయి. దాదాపుగా ప్రతీ జిల్లాలోనూ.. రోజుకు వంద కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్క రోజు… ఈస్ట్ గోదావరి జిల్లాలో 500 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close