తెలుగులో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక బయోపిక్స్లో ‘యన్.టి.ఆర్’ ముఖ్యమైనది. బాలకృష్ణ హీరోగా, టైటిల్ రోల్లో తన తండ్రి ఎన్టీఆర్గా నటిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. ఇటు క్రిష్… అటు బాలకృష్ణ… నటీనటుల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. బసవతారకం పాత్రకు విద్యాబాలన్ను, చంద్రబాబు నాయుడు పాత్రకు రానా దగ్గుబాటిని తీసుకోవడంలో ఇద్దరి చాకచక్యం కనిపించింది. ఎంతోమంది ప్రముఖులతో ఎన్టీఆర్ జీవితం ముడిపడి వుంది. ఆ ప్రముఖుల పాత్రలకు అల్లాటప్పా నటీనటులు కాకుండా కాస్త పేరున్నవాళ్లను తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇదే అదునుగా చాలామంది వార్తలు వండుతున్నారు. అప్పటి ప్రముఖ కథానాయిక శ్రీదేవిగా రకుల్, మరో కథానాయిక జయప్రదగా రాశిఖన్నా నటించనున్నారని వార్తలు వచ్చాయి. రకుల్ సంగతి పక్కన పెడితే… ‘యన్.టి.ఆర్’లో నటించడం లేదని రాశిఖన్నా స్పష్టం చేసింది. “ఇప్పటివరకూ జయప్రద పాత్రలో నటించమని నన్నెవరూ సంప్రతించలేదు. ఎన్టీఆర్ బయోపిక్లో నేను నటిస్తున్నాననేది నాకూ వార్తే” అని రాశిఖన్నా పేర్కొంది.