అనుష్క కోసం త్యాగం చేస్తున్న రవితేజ

మాస్ మహరాజ్ రవితేజ ఈ నెల 27న బెంగాల్ టైగర్ తో సినిమాతో అలరిస్తాడని ఫ్యాన్స్ అందరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఫ్లాష్ న్యూస్ ఏంటంటే అదే రోజు రిలీజ్ అవుతున్న సైజ్ జీరో సినిమా కోసం తన సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకున్నాడట రవితేజ. సంపత్ నంది డైరక్షన్లో మోస్ట్ ఎవైటెడ్ మూవీగా వస్తున్న బెంగాల్ టైగర్ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు రవితేజ. అందుకే సినిమాకు ఎటువంటి కాంపిటీషన్ లేకుండా ఉండేందుకు చూస్తున్నాడు. అసలైతే సినిమా దీపావళికే రావాల్సి ఉన్నా అఖిల్ కోసం నాగ్ కోరిక మేరకు సినిమా వాయిదా వేశాడు. ఇప్పుడు సైజ్ జీరో కోసం మళ్లీ రెండోసారి వాయిదా వేసుకుంటున్నాడు.

సైజ్ జీరో విషయానికొస్తే అనుష్క లీడ్ రోల్లో చేసిన ఈ సినిమా ప్రకాశ్ కోవెలమూడి డైరెక్ట్ చేశాడు. రుద్రమదేవి టైంలోనే ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉన్నా ఆ సినిమా కారణంగా సైజ్ జీరో పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. చివరకు ఈ నెల 27న రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైన సైజ్ జీరోకి రవితేజ పోటీగా నిలుస్తాడనుకున్నారు. కాని రెండు సినిమాల దర్శక నిర్మాతల అండస్టాడింగ్ తో రవితేజ సినిమా పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది.

తమన్నా, రాశి ఖన్నాలు హీరోయిన్స్ గా నటిస్తున్న బెంగాల్ టైగర్ సినిమాను ఫుల్ లెంథ్ మాస్ ఎంటర్టైనర్ గా రవితేజ అభిమానులకు మంచి విందు భోజనంలా తెరకెక్కించాడు సంపత్ నంది. సినిమా ఈ నెల 27 నుండి డిశెంబర్ 10కి పోస్ట్ పోన్ చేస్తున్నారని తెలుస్తుంది. మరి పరిశ్రమ మేలుకోసం పరస్పర ఒప్పందంతో రిలీజ్ అవుతున్న ఈ రెండు సినిమాలు ప్రేక్షకాదరణం పొంది సూపర్ హిట్స్ గా నిలవాలని కోరుకుందాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close