కేసీఆర్‌కు అవమానం: ఏపీ అధికారులు కావాలనే చేశారా!

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అవమానించిందంటూ నమస్తే తెలంగాణ పత్రిక నిన్న ఒక కథనాన్ని ఇచ్చింది. నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన విశేషాలతో ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక ఫోటో ఎగ్జిబిషన్‌లో కేసీఆర్ ముఖానికి ఏపీ ప్రభుత్వం నల్లరంగు పులిమిందని ఆరోపించింది. ఆయన ముఖం కనిపించకుండా చేసి పైశాచికత్వాన్ని ప్రదర్శించిందని మండిపడింది.

అసలు జరిగిందేమిటంటే, ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో నిన్న ప్రారంభమైన ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్‌వారి ఎగ్జిబిషన్‌లో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌లో రాజధాని అమరావతి విశేషాలను ప్రజలకు తెలియచెప్పటంకోసం ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. విజయదశమి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడి చేతులుమీదగా జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి నాలుగు ఫోటోలను ఆ ఫోటో ఎగ్జిబిషన్‌లో పెట్టారు. ఆ నాలుగు ఫోటోలలో కేసీఆర్ ముఖానికి నలుపు రంగు పులిమి ఉంది. అది ప్రభుత్వమే చేయించందని నమస్తే తెలంగాణ ఆరోపణ.

ఎగ్జిబిషన్ ప్రారంభమవటానికి ముందు రోజు తీసిన ఫోటోలను నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురించారు. ఎగ్జిబిషన్ ప్రారంభమైన తర్వాత ఎలా ఉందో రాయలేదు. ఇదిలా ఉంచితే, ఇలా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటోలకు నలుపురంగు పులమటాన్ని బుద్ధి, జ్ఞానం, విచక్షణ ఉన్న వారెవరూ ఆమోదించరు. ఎవరో కింది స్థాయి ఉద్యోగో, మరెవరైనా తుంటరో చేసినదానికి, దానిని ఏపీ ప్రభుత్వం మొత్తానికీ ఆపాదించి ద్వేషం వెళ్ళగక్కటం ఒక బాధ్యతాయుతమైన దినపత్రిక చేసే పని కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close