లైన్ క్లియ‌ర్‌: ర‌వితేజ – సంతోష్ శ్రీ‌న్‌వాస్ డిసెంబ‌రులో

ర‌వితేజ క‌థానాయ‌కుడిగా సంతోష్‌శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రం ప‌ట్టాలెక్కాల్సింది. ఈ సినిమాని మైత్రీ మూవీస్ సెట్ చేసింది. కానీ ఎందుక‌నో.. ఈ ప్రాజెక్ట్ పైప్ లైన్‌లోనే ఉండిపోయింది. దాంతో ఈసినిమా ఆగిపోయిందంటూ ప్ర‌చారం మొద‌లైంది. దీనిపై మైత్రీ మూవీస్ స్పందించింది. ”ఈ కాంబినేష‌న్‌లో సినిమా వ‌స్తుంది. డిసెంబ‌రులో సినిమా మొద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి. ‘తేరీ’ రీమేక్ అని ప్ర‌చారం జ‌రుగుతోంది. అది నిజ‌మే. కానీ.. తేరీ సినిమాని య‌ధాత‌థంగా రీమేక్ చేయ‌డం లేదు. తేరీలో ఉన్న పాయింట్ ని మాత్ర‌మే తీసుకున్నాం” అని క్లారిటీ ఇచ్చేసింది. మైత్రీ మూవీస్ నుంచి వ‌స్తున్న ‘స‌వ్య‌సాచి’ ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. వ‌చ్చే నెల‌లో ‘అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ’ కూడా విడుద‌ల‌కు రెడీ అయ్యింది.

మైత్రీ మూవీస్ చేతిలో దాదాపు 14 సినిమాలున్న‌ట్టు ఓ అంచ‌నా. దీనిపై కూడా మైత్రీ స్పందించింది. ”మ‌రీ 14 లేవు గానీ, ఓ ప‌ది వ‌ర‌కూ ఉన్నాయి. అయితే… అన్నీ ఒకేసారి మొద‌ల‌వ్వ‌లేవు క‌దా? ఒక‌సారి రెండు సినిమాల్ని మాత్ర‌మే ప‌ట్టాలెక్కించ‌గ‌లం. ఇది వ‌ర‌క‌టితో పోలిస్తే.. ఇప్పుడు కాస్త స్పీడ‌ప్ అయ్యాం.. యేడాదికి క‌నీసం మూడు చిత్రాల్ని అందివ్వాల‌న్న‌ది ల‌క్ష్యంగా పెట్టుకున్నాం” అంటున్నారు మైత్రీ మూవీస్ నిర్మాత‌లు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close