దిశ ఘటన మిగిల్చిన ఆవేదన కారణంగానే సోషల్ మీడియా లోకి: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఏదో ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసి ఎప్పుడో ఒకసారి ట్వీట్ చేసి ఊరికే ఉండడం కాకుండా, తరచుగా స్వీట్స్ చేస్తూ సోషల్ మీడియాలో చుక్క ఉంటున్నారు . అయితే ఇంత కాలం తర్వాత, చాలా ఆలస్యంగా సోషల్ ఇండియా లోకి ఎంట్రీ ఇవ్వడానికి కారణం ఏంటో తెలియజేశారు చిరంజీవి. దిశ ఘటన అప్పుడే సోషల్ మీడియాలోకి రావాలని అనుకున్నట్లు వివరించారు. వివరాల్లోకి వెళితే..

ఒక ప్రముఖ టీవీ ఛానల్ కి చిరంజీవి ఇంటర్వ్యూ ఇచ్చారు. కరోనా విపత్తు సమయంలో సినీ కార్మికులకు అండగా ఉండటానికి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి, సినీ కార్మికులకు అండగా నిలబడుతున్నారు. తను ఆర్థిక సహాయం చేయడమే కాకుండా తన తోటి కళాకారులు సినీ పెద్దలు కూడా సహాయం చేసేలా ప్రోత్సహించి ఆ డబ్బుని నేరుగా లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు నేరుగా అందిస్తున్నారు. ఈ విషయాలను చర్చించడానికి టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా సోషల్ మీడియాలో కి రావడానికి ఎందుకింత ఆలస్యం చేశారు అన్న ప్రశ్న చిరంజీవికి ఎదురైంది.

చిరంజీవి దానికి సమాధానమిస్తూ, దిశ ఘటన సమయంలో తాను ఎంతో ఆవేదనకు గురయ్యానని, ఆ సమయంలో తన ఆవేదనను పంచుకోవడానికి సోషల్ మీడియా లో అకౌంట్ ఉంటే బాగుండేదని అనిపించింది అని చెప్పుకొచ్చారు. ప్రెస్ నోట్ విడుదల చేసి ఉంటే అది ప్రజలకి చేరి ఉండేదేమో కానీ ఒక సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన భావాలను నేరుగా తెలియజేస్తే అది మరింత ప్రభావవంతంగా ఉంటుందని అనిపించిందని చిరంజీవి చెప్పుకొచ్చారు. అదే విధంగా జనవరి ఫిబ్రవరి ఈ సమయంలో కరోనా ముప్పు ముంచుకొస్తున్న సమయంలో ప్రజలకు తగిన సూచనలు ఇవ్వడానికి, ప్రజలతో తన భావాలను పంచుకోవడానికి సోషల్ మీడియా లో కి రావాలని గట్టిగా నిర్ణయించుకున్నట్టు చిరంజీవి చెప్పారు.

ఏదిఏమైనా చిరంజీవి సోషల్ మీడియాలో కి రావడం ఆయన అభిమానులకు ఆనందాన్ని ఇస్తుంది. అదే విధంగా ఉపాధి కోల్పోయిన కార్మికులకు చిరంజీవి అండగా ఉంటూ తెలుగు పరిశ్రమకు పెద్దన్న పాత్ర పోషిస్తున్నట్లు గా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close