హైదరాబాద్ నిరసనలపై కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చిన రేవంత్ !

సెటిలర్ల ఓట్లు కావాలి కానీ వారు నిరసనలు చేసుకోవాలంటే ఏపీకి వెళ్లి చేసుకోమ్మంటారా అని.. కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ పై రేవంత్ రెడ్డి నేరుగా ఇప్పటి వరకూ స్పందించలేదు. కానీ అరెస్టులపై నిరసనలు చేసుకోవడానికి అనుమతిచ్చేది లేదని కేటీఆర్ కామెంట్స్ చేసిన తర్వాత స్పందించారు. చంద్రబాబు అరెస్టు కేసుల గురించి మట్లాడలేదు కానీ..కేటీఆర్ కామెంట్స్ ను మాత్రం తప్పు పట్టారు. పదేళ్ల పాటు హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అని, ఏపీకి సంబంధించిన అంశంపై ఇక్కడ నిరసన జరపొద్దు అంటే ఎలా? అని ప్రశ్నించారు.

చంద్రబాబు అరెస్ట్‌పై నిరసనలు వ్యక్తం చేస్తున్న ఐటీ ఉద్యోగులపై ఆంక్షలు విధించడం, ఆందోళన చేయొద్దని కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం అర్ధరహితం అని మండిపడ్డారు. అసలు ఐటీ ఉద్యోగుల నిరసనల్లో తప్పేముంది అని ప్రశ్నించారు. చంద్రబాబు ఏపీకి మాత్రమే సంబంధించిన నాయకుడు కాదని.. ఆయన అరెస్ట్ జాతీయ అంశమని స్పష్టం చేశారు. ఆయన లాంటి అనుభవం ఉన్న వాళ్లను వేళ్ల మీద లెక్కబెట్టవచ్చన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో వైట్ హౌస్ ముందే ధర్నాలు చేశామని.. ఐటీ కారిడార్ లో చేస్తే తప్పేముందన్నారు.

చంద్రబాబు అరెస్టు విషయంలో తెలంగాణలో బీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ధైర్యంగానే స్పందించారు. బీఆర్ఎస్ హైకమాండ్ మాత్రమే.. తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. రాజకీయ కక్ష సాధింపుల అరెస్ట్ అనే అభిప్రాయంతోనే ఎక్కువ మంది ఉన్నారు. అదే చెబుతున్నారు. టీ పీసీసీ చీఫ్ గా ఉన్నందున.. తన అభిప్రాయం చెబితే.. వివాదం అవుతుందని రేవంత్ రెడ్డి స్పందించలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close