వైఎస్ ఆత్మ కేసీఆర్ ఆత్మగా మారింది: కేవీపీపై రేవంత్ సంచలనవ్యాఖ్యలు

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి ఆత్మగా వ్యవహరించిన కాంగ్రెస్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆత్మగా మారారని, కేసీఆర్ పంచన చేరి ప్రాజెక్టులు, కాంట్రాక్టులు చక్కబెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ కేవీపీ కనుసన్నలలో నడుస్తున్నారని చెప్పారు. తెలంగాణలో కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులన్నీ కేవీపీ సూచనలలో భాగమేనన్నారు. రేవంత్ ఇవాళ కొడంగల్‌లో మీడియాతో మాట్లాడారు. చర్లపల్లి జైలునుంచి బయటకొచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడటం ఇదే ప్రథమం. చంద్రబాబునాయుడు పాలమూరు ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకమని టీఆర్ఎస్ నేతలు అసత్యప్రచారం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖలో ఎత్తిపోతల పథకాన్ని నిలిపేయాలని ఎక్కడా రాయలేదని వివరణ ఇచ్చారు. ప్రభుత్వమే ఇవాళ మహబూబ్ నగర్ బంద్‌ను నిర్వహించటం అనాగరికంగా ఉందన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశ్యంతోనే బంద్ పాటించి టీఆర్ఎస్ నేతలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. గతంలో ఎక్కడా ప్రభుత్వాలు బంద్‌కు పిలుపునిచ్చిన సందర్భాలు లేవని చెప్పారు. ప్రాణహిత ప్రాజెక్ట్ కోసం హరీష్ ఆమరణ నిరాహారదీక్ష చేస్తే తాను మద్దతిస్తానని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close