కేసీఆర్ ఫాంహౌస్‌పై గురి పెట్టిన రేవంత్ రెడ్డి !

కేసీఆర్‌కు ఫాం హౌస్ అంటే ఎంత ఇష్టమో… ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరైనా ఫాంహౌస్‌పై విమర్శలు చేసినా సహించరు. ఫాంహౌస్‌ను దున్నిస్తానన్న బండి సంజయ్‌ను ఆయన ఎలా తిట్టారో ఇంకా సోషల్ మీడియాలో వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను మరింత రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో ఏ పంట వేశారో చూస్తామని.. ఆ గ్రామంలో రైతులతో మాట్లాడతామని ఆయన ప్రకటించారు. 27వ తేదీని ముహుర్తంగా ఖరారు చేశారు.

డిసెంబర్ 27మధ్యాహ్నం 2 గంటలకు రైతులంతా ఎర్రవెల్లికి రావాలని.. టీపీసీసీ ముఖ్యనేతలంతా ఇందులో పాల్గొంటారని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా కేసీఆర్, మోడీ ఒక్కటేనని వివరిస్తామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఎజెండా రైతు సమస్యే అయినా… తెలంగాణలో ఉన్న పోటాపోటీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని ఎలా రేసులోకి తీసుకు రావాలో రేవంత్ రెడ్డి బాగా ఆలోచించి వేసిన ప్లాన్‌గా అభివర్ణిస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ కావాలనే కాంగ్రెస్‌ను సైడ్ చేసే లా రాజకీయాలు చేస్తున్నాయని.. దాన్ని ఎదుర్కోవాలంటే కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేసే విధంగానే రాజకీయం చేసేందుకు డిసైడయ్యారని తెలుస్తోంది.

ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలంటే అందుకు ఆయన వ్యవసాయ క్షేత్రం ఉన్న ఎర్రవెల్లిలో కార్యక్రమం నిర్వహించడమే కరెక్ట్ అనే నిర్ణయానికి రేవంత్ రెడ్డి వచ్చారని తెలుస్తోంది. అయితే కేసీఆర్ ఫామ్ హౌస్‌ వైపు ఎవర్నీ వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటారు. అసలు ఎర్రవెల్లి గ్రామానికి పంపిస్తారా అనే డౌట్ కూడా ఉంది. అందుకే ఇరవై ఏడో తేదీన ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని అంచనా వేస్తున్నారు. ఇటీవల ఫామ్‌హౌస్‌లో ఓ యువకుడి చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది కూడా వివాదాస్పదమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close