ఏపీలో ప్రభుత్వం మారుతుందని చెప్పకనే చెప్పిన రేవంత్

ఏపీతో సత్సంబంధాలను కోరుకుంటున్నానని.. కొత్త సీఎంతో భేటీ అవుతానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబుతన్నారు. మనవడి పుట్టు వెంట్రుకలు తీయించేందుకు తిరుమల వచ్చారు. ఈ సందర్భంగా దర్శనం పూర్తయిన తర్వాత మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఏపీలో ఘర్షణ వైఖరి కోరుకోనని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయిన తర్వాత ఒక్క సారి కూడా ఏపీ సీఎంను కలవలేదు. కలవలేదు అనడం కన్నా కలిసేందుకు సీఎం జగన్ ఆసక్తి చూపించలేదని అనుకోవచ్చు.

కనీసం రేవంత్ రెడ్డి గెలిచినప్పుడు .. సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా చిన్న శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. ఈ అంశంపై రేవంత్ రెడ్డి కూడా ఒకటి , రెండు సార్లు స్పందించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత .. ఏపీ వైపు నుంచి ఎలాంటి సందేశం కూడా రాలేదన్నారు. కారణం ఏదైనా రేవంత్ రెడ్డి అంటే.. జగన్మోహన్ రెడ్డికి ఇష్టం ఉండదు. చంద్రబాబు అంటే రేవంత్ రెడ్డి గౌరవం చూపించడం దీనికి కారణం కావొచ్చు.. లేదా కేసీఆర్ ను ఓడించారని.. కేసీఆర్ గెలుపు కోసం తాను చేసిన సాయం గురించి తెలిస్తే రేవంత్ కసి తీర్చుకుంటారన్న ఆందోళన కావొచ్చన్న అభిప్రాయం ఉంది.

పైగా ఇటీవల షర్మిలను ఏపీ రాజకీయాల్లో పంపడానికి రేవంత్ రెడ్డి, చంద్రబాబు కలిసే కుట్ర చేశారని కూడా ఆరోపించారు. ఈ పరిణామాలతో ఇద్దరి భేటీ సాధ్యం కాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్త సీఎంతో భేటీ అవుతానని చెప్పడానికి కారణం.. ముఖ్యమంత్రి మారుతారన్న అభిప్రాయంతోనేనని అంటున్నారు. చంద్రబాబు సీఎం అయితే రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం నిర్మాణాత్మకంగా చర్చలు జరిగే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ కోణంలోనే రేవంత్.. కొత్త ముఖ్యమంత్రితో భేటీ గురించి వ్యాఖ్యానించినట్లుగా భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఊపిరి పీల్చుకున్న డబ్బింగ్ బొమ్మ

తమిళ సినిమాలు తెలుగులో తెగ అడేస్తాయి. విక్రమ్, జైలర్ విజయాల్లో తెలుగు ప్రేక్షకుల వాటానే ఎక్కువ. అయితే కొన్నాళ్ళుగా తమిళ సినిమాల సందడి తగ్గింది. ఇలా రావడం అలా వెళ్ళిపోవడమే కానీ ఒక్కటంటే...

ట్రైనీ ఐఏఎస్ గా కూతురు… ఉప్పొంగిన హృదయంతో తండ్రి సెల్యూట్

ఆ దృశ్యం... అందరినీ కదిలించింది. ఆమె విజయం.. ఆ కన్నతండ్రికి గర్వకారణమైంది. తమ పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటే చూసి మురిసిపోవాలని తండ్రులందరూ భావిస్తారు కానీ, కొంతమంది తండ్రుల ఆశలు మాత్రమే...

చెవిరెడ్డి శ్రీవారి దర్శన వ్యాపారం రేంజే వేరు !

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి .. జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్ రెడ్డి సతీమణికి తన ఇంటి పక్కన గోశాల లాంటి కుటీరం కావాలని అనిపిస్తే.. అఘమేఘాల మీద కట్టేస్తాడు....

ఫర్నిచర్‌కు జగన్ డబ్బులిచ్చేస్తారట !

సీఎంగా చేసి ఫర్నీచర్‌ను కొట్టేశారని జగన్ పై వస్తున్న ఆరోపణలకు వైసీపీ స్పందించింది. ఓడిపోగానే.. ప్రజాధనంతో క్యాంప్ ఆఫీసు కోసం కొనుగోలు చేసిన వస్తువులన్నింటికీ డబ్బులిస్తామని ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని వైసీపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close