ఆర్కే పలుకు : చేతులెత్తేసిన ఇద్దరు ముఖ్యమంత్రులు !

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాలన కంటే రాజకీయాల మీద దృష్టి పెట్టి అనవసర , రాజ్యాంగ వ్యతిరేక పాలనా పద్దతులను పాటించి ప్రజావ్యతిరేకతను తీవ్రంగా మూట గట్టుకున్నారని.. ఇప్పుడు చేతులెత్తేసిన పరిస్థితికి చేరుకున్నారని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తన వారాంతపు ఆర్టికల్ “కొత్తపలుకు”లో విశ్లేషించారు. ఏపీలో ప్రభుత్వంపై అసంతృప్తి ప్రజల్లో ఎంత నిగూఢంగా ఉందో బీఆర్టీఎస్ రోడ్‌లో జరిగిన ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసనే సాక్ష్యమని ఆయన అంటున్నారు.

ప్రజల్ని భయపెట్టిన పాలన సాగిస్తున్న జగన్ రెడ్డిని చూసి ప్రజలు భయపడే పరిస్థితి రాను రాను తగ్గిపోతోందని ఉద్యోగ, ఉపాధ్యా య ఆందోళనలు తేల్చి చెబుతున్నాని ఆర్కే స్పష్టం చేశారు. రాష్ట్రం నాశనమైపోయిందన్న విషయాన్ని ప్రజలు గ్రహించారని చెత్తపన్ను, ఓటీఎస్ వంటి విషయాల్లో పేద ప్రజలు సైతం ప్రభుత్వంపై నేరుగా విరుచుకుపడుతున్నారని గుర్తు చేశారు. రూ. లక్షల కోట్ల అప్పు చేసి ఒక్క అభివృద్ధి పని చేయని… ఒక్కసాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తి చేయని జగన్ తీరు వల్ల ప్రజలకు నష్టం ఇప్పుడే వారికి అర్థమవుతోందంటున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని జగన్ ఇప్పటికైనా అర్థం చేసుకోకపోతే ఎంత భారీ విజయం వచ్చిదో అంతే దారుణ పరాజయం ఎదురు వస్తుందని ఆర్కే విశ్లేషించారు.

ఇక కేసీఆర్ … తన అడ్డం పొడుగు మాటలతో ఏ మాత్రం నమ్మలేని రాజకీయ నాయకుడిగా మారిపోయారని ఆర్కే తేల్చేశారు. బీజేపీపై ఆయన పోరాటాన్ని ఎవరూ నమ్మడం లేదంటున్నారు. రేవంత్ రెడ్డిని అడ్డుకోవడానికి బీజేపీని హైప్ చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని… కేసీఆర్ రాజకీయం ఎలా ఉన్నా బీజేపీ మాత్రం తెలంగాణలో అధికారం దక్కించుకోవడానికి బ్లూ ప్రింట్ రెడీ చేసుకుందని ఆర్కే చెబుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికలు ముగిసిన తర్వాత అంటే జూలై నుంచి తెలంగాణలో అమలు చేయాల్సిన వ్యూహాలను ఖరారు చేసుకున్నారని.. కేసీఆర్‌కు అసలు సినిమా అప్పట్నుంచి కనిపిస్తుదని ఆర్కే విశ్లేషించారు.

బీజేపీని వ్యతిరేకించే క్రమంలో రాజ్యాంగంపై వ్యాఖ్యలు చేసి కేసీఆర్ తన నెత్తి మీద తాను చేయి పెట్టుకున్నారని దళిత బంధు పథకంతో వారి మద్దతు పొందాలనుకున్న కేసీఆర్ ఇప్పుడు.. అసలుకే మోసం తెచ్చుకున్నారని అంటున్నారు. పరిస్థితులు చూస్తూంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేతులెత్తేసి తమను తాము కాపాడుకోవడానికి అడ్డగోలు పనులు చేస్తున్నారన్న ఓ సందేశాన్ని ఈ వారం “కొత్తపలుకు” ద్వారా ఆర్కే ప్రజల్లోకి పంపారని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

LRS అమలుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊపు !

తెలంగాణలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని...

తిరుమ‌ల‌లో ప్ర‌క్షాళ‌న మొద‌లు… మంచి రోజులొచ్చిన‌ట్లే!

తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నం అంటే దేశ‌, విదేశాల నుండి వ‌స్తుంటారు. ఉత్త‌రాధి నుండి తిరుమ‌ల‌కు ఒక్క‌సారి వెళ్లి రావాల‌న్న వారు అధికంగా ఉంటారు. వెంక‌టేశ్వేర స్వామి వారి ద‌ర్శ‌నం కోసం ఎంత క‌ష్ట‌మైన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close