“మా” ఎలక్షన్లలో రోజాది ఓటర్‌ రోల్ మాత్రమే..!

రోజా అంటేనే ఫైర్ బ్రాండ్. వివాదాస్పద అంశాలు.. అదీ కూడా సినిమా, రాజకీయం అంటే ఆమె ఎంట్రీ లేకుండా ఉండదు. అయికే కొద్ది రోజులుగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల హడావుడి నడుస్తోంది. అందరూ రకరకాలుగా స్పందిస్తున్నారు. కానీ ఫైర్ బ్రాండ్ రోజా మాత్రం మిస్సయ్యారు. ఓటింగ్‌కు రెండు రోజుల ముందు ఆమె నోరు విప్పారు. మా ఎన్నికల విషయంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోనని.. ఎలాంటి ప్రకటనలు కూడా చేయబోనని స్పష్టం చేశారు.

రోజా వైపు నుంచి ఇలాంటి ప్రకటన రావడంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సినీ పరిశ్రమ విషయంలో అదీ కూడా…నటీ నటుల సంఘం విషయంలో ఆమె సైలెంట్‌గా ఉండటం కాస్త ఆసక్తికరమే . ఎవరి వైపు తీసుకోకపోవడం మరింత విచిత్రంగా చెప్పుకోవచ్చు. అయితే రోజా ఏం మాట్లాడినా ఆమె నటిగా మాత్రమే కాకుండా ఆమె ఉన్న పార్టీ వైసీపీ తరపు నుంచి కూడా చూస్తారు.

అదే సమయంలో ప్రభుత్వం .. మా ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని అధికారికంగా ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ వైపు ఉండకపోవడమే మంచిదని భావించినట్లుగా తెలుస్తోంది. రోజా ఎవరి వైపు ఉండకపోవడం.. ఎలాంటి వివాదాస్పద ప్రకటనలు చేయకపోవడంతో.. మా ఎన్నికల వేడి మరో రేంజ్‌కు వెళ్లకుండా ఆగిపోయిందని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close