లోకేష్‌ ఓ పప్పుసుద్ద: జగన్‌ తరఫున రోజా ఫైర్‌!

‘దమ్ముంటే చర్చకు రా’ అంటూ వైఎస్‌ జగన్మోహనరెడ్డికి లోకేష్‌ విసిరిన సవాలుకు ఆయన తరఫున రోజా స్పందించారు. లోకేష్‌ ఒక పప్పుసుద్ద… జగన్‌ వంటి ప్రజానాయకుడిని దమ్ముందా అని అడిగే అర్హత అసలు లోకేష్‌కు లేనేలేదని రోజా ఎద్దేవా చేశారు. లోకేష్‌ ఇదే తరహాలో తెలంగాణలో కూడా ‘దమ్ముందా.. దమ్ముందా..’ అంటూ కేసీఆర్‌కు కూడా పలుమార్లు సవాళ్లు విసిరారని, ఇప్పుడు తెలంగాణలో ఆ పార్టీ ఏ స్థితిలో ఉన్నదో అందరికీ తెలుసునని రోజా అన్నారు. ఏపీలో కూడా తెలుగుదేశం అదే స్థితికి చేరుకుంటుందని దుమ్మెత్తిపోసారు.

పనిలో పనిగా.. చంద్రబాబునాయుడు అవినీతి మీద కూడా రోజా విమర్శలను సంధించారు. బాబు అవినీతి మీద సీబీఐ విచారణ జరిపించాలంటూ డిమాండ్‌ను వినిపించారు. ఇవాళ వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఏపీలో జరుగుతున్న అరాచకాల గురించి.. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తెలియజేస్తూ ఉంటే.. దాని గురించి ఏపీ బ్రాండ్‌ను చెడగొట్టడానికే జగన్‌ వెళ్లారంటూ ఆడిపోసుకుంటున్న చంద్రబాబునాయుడు సర్కారు వైఖరిని కూడా రోజా కడిగిపారేశారు. గతంలో వైఎస్‌ఆర్‌ పాలనలో.. రాజా ఆఫ్‌ కరప్షన్‌ అంటూ చంద్రబాబు పుస్తకాలు ముద్రించి.. ఢిల్లీ గల్లీల్లో తిరిగి ప్రతి నాయకుడికీ పంచిపెట్టారని, అప్పట్లో మీరు ఏపీ బ్రాండ్‌ ను దెబ్బతీయడానికే అలా చేశారా అంటూ రోజా ప్రశ్నించారు.

జగన్‌ మీదికి లోకేష్‌ సవాళ్లు విసిరిన నేపథ్యంలో.. లోకేష్‌ మాటలకు స్పందించడం తన స్థాయి కాదని జగన్‌ భావిస్తారని, తన అనుచరులతో ఎవరిద్వారానైనా ప్రతివిమర్శలు చేయిస్తారని తెలుగు360 ముందే విశ్లేషణలో తెలియజేసింది. దానికి తగ్గట్లుగానే జగన్‌ తరఫున రోజా తెరపైకి వచ్చి, లోకేష్‌ మీద వాగ్దాడులకు పూనుకోవడం విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close