చంద్రబాబునాయుడు అంతు చూస్తా – రోజా

హైదరాబాద్: వెన్నుపోటు రాజకీయాలు తనపై ప్రదర్శిస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతు చూస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా హెచ్చరించారు. ఆమె ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇవాళ అసెంబ్లీలో తెలుగుదేశం ఎమ్మెల్యే అనిత, మిగతా టీడీపీ ఎమ్మెల్యేలు తన వ్యాఖ్యలపై స్పందిచటంమీద రోజా మండిపడ్డారు. చంద్రబాబునాయుడు వెన్నుపోటు రాజకీయాలు తనపై ప్రదర్శిస్తే అంతుచూస్తానని అన్నారు. సెక్స్ రాకెట్‌ను తప్పుదారి పట్టించటానికి తనపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌లా తయారైందని అన్నారు. దేశంలోనే అత్యంత ఘోరమైన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గతంలో ఎన్నోసార్లు సస్పెండ్ అయినప్పటికీ అసెంబ్లీ ఆవరణలోనే తిరిగేవారని, నిన్న మొన్న సస్పెండయిన వైసీపీ ఎమ్మెల్యేలు ప్రసాదరెడ్డి, రాజా కూడా అసెంబ్లీ ఆవరణలో తిరిగినా పట్టించుకోలేదని, తనపై కక్షసాధింపుకు పాల్పడ్డారని అన్నారు. చంద్రబాబునాయుడు భార్య, కోడలుకు కూడా ఒక విజ్ఞప్తి చేశారు. విజయవాడవంటి ఎన్నోచోట్ల తెలుగుదేశం ప్రభుత్వం వలన ఆడవాళ్ళు రోదిస్తున్నారని, వారి కన్నీళ్ళ ఉసురు కొడుతుందని హెచ్చరించారు. మంత్రి యనమల తనంత తెలివిగలవాడు ప్రపంచంలోనే ఎవరూ లేరన్నట్లు మాట్లాడుతున్నారని రోజా అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close