ఎంత క‌ష్ట‌ప‌డ్డావో తేజూ..!

రోడ్డు ప్ర‌మాదంలో సాయిధ‌ర‌మ్ తేజ్ గాయ‌ప‌డ‌డం, ఆ త‌ర‌వాత షూటింగుల‌కు దూరం అవ్వ‌డం, క్ర‌మంగా కోలుకొని మ‌ళ్లీ కెమెరా ముందుకు రావ‌డం తెలిసిన విష‌యాలే. ప్ర‌మాదం త‌ర‌వాత తాను చేసిన సినిమా `విరూపాక్ష‌`. ఇప్పుడు విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత కోలుకొని, సెట్ కి వెళ్లింది విరూపాక్ష‌తోనే. అయితే.. ఈ షూటింగ్ అనుకొన్నంత సుల‌భంగా సాగ‌లేదు. సాయిధ‌ర‌మ్ తేజ్‌కి సెట్లో పెద్ద ప‌రీక్ష పెట్టింది. గాయం నుంచి కోలుకొన్నా – తేజ్ నోటి నుంచి మాట రావ‌డం క‌ష్ట‌మైంది. దాంతో.. సెట్లో తేజ్ ఏం మాట్లాడుతున్నాడో.. ఎదుట ఉన్న అర్టిస్టుకీ, మానేట‌ర్ ముందు కూర్చున్న ద‌ర్శ‌కుడికీ అర్థం కాని ప‌రిస్థితి. ఇలాంటి స‌మ‌యంలోనే… తేజ్ మైమ్ చేయాల్సివ‌చ్చింద‌ట‌. డైలాగులు చెప్ప‌డు కానీ.. లిప్ మూమెంట్ మాత్రం ఇస్తుంటాడు. దాన్ని అర్థం చేసుకొని, ఎదుటి ఆర్టిస్టు న‌టించాల్సి వ‌స్తుంది. ఈ ప్ర‌క్రియ‌.. కొన్ని రోజుల పాటు కొన‌సాగింది. ఆ త‌ర‌వాత‌… తేజ్ కాస్త కుదుట ప‌డి, సెట్లో తన డైలాగులు తానే చెప్పుకోగ‌లిగే స్థాయికి చేరుకొన్నాడు. ఇది ఓ ర‌కంగా తేజూకే కాదు. సెట్లో ఉన్న మిగిలిన న‌టీన‌టుల‌కు, ద‌ర్శ‌కుడికీ ప‌రీక్షే. అయితే… ద‌ర్శ‌కుడు, ఇత‌ర న‌టీన‌టుల స‌హ‌కారంతో తేజ్ ఈ ప‌రీక్ష పాసైపోయాడు. అందుకే ఈ సినిమాకి తేజ్ ఎమోష‌న‌ల్‌గా కనెక్ట్ అయిపోయాడు. ఇప్ప‌టికీ తేజ్‌…. మాట‌లు కాస్త త‌డ‌బ‌డుతూనే ఉన్నాయి. `విరూపాక్ష‌` ప్రెస్ మీట్ నిన్న హైద‌రాబాద్ లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా.. సెట్లో తాను ప‌డిన క‌ష్టాల్ని గుర్తు చేసుకొన్నాడు తేజ్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close