ముఖ్యమంత్రి చంద్రబాబుకు భవిష్యత్ భయంకరంగా ఉంటుందని నెల్లూరు జైలు ముందు నిలబడి సజ్జల రామకృష్ణారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఆయన మాటలు విని పక్కన ఉన్న వాళ్లు కూడా.. కావాలంటే జగన్ రెడ్డిని చూడండని మనసులో అనుకుని ఉంటారు. చంద్రబాబు ఇప్పటికి నాలుగోసారి సీఎం అయ్యారు. ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు అక్రమార్కుల్ని వెంటాడుతున్నారు. తప్పు చేసిన వాళ్లు రాజకీయ ముసుగులో ఉన్నా వదిలి పెట్టడం లేదు. అధికారం శాశ్వతం అనుకుని అడ్డగోలుగా చెలరేగిపోయారు. ఇప్పుడు వారంతా జైలుకెళ్తూంటే.. చంద్రబాబును బెదిరిస్తున్నారు.
చంద్రబాబు తన రాజకీయ జీవితంలో చూడనంతటి ఘోరాలని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చూశారు. కానీ జగన్ రెడ్డి ఇప్పుడు చూస్తున్నారు. ఎంతో రాజకీయ భవిష్యత్ ఉందనుకున్న ఆయనను పాతాళంలోకి నెట్టేసే సలహాలు ఇచ్చింది సజ్జల. జగన్ రెడ్డి భవిష్యత్ ను అత్యంత భయానకం చేసింది సజ్జల. అంత కంటే ఎక్కువ భయానకాన్ని ఎవరూ చేయలేరు. చంద్రబాబును బెదిరించినంత మాత్రాన ఆయన భవిష్యత్ ను ఎవరూ భయానకం చేయలేరు. అరిచే కుక్కలు కరవవన్న సామెత ఉంది. ఎంత బెదిరించినా.. భయపడేవారు ఉండరు.
ముందు జగన్ రెడ్డికి ఉన్న భయానక భవిష్యత్ కు సజ్జల బాధ్యత తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడే ఆయన నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. వచ్చే కొద్ది రోజుల్లో సజ్జలకు భయంకరమైన భవిష్యత్ కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన కుమారుడి కోసం కిందా మీదా పడుతున్నారు. రేపు సజ్జల టైం రాదని ఎవరూ చెప్పలేరు. పిట్ట బెదిరింపులకు భయపడి.. వైసీపీ నేతలు చేసిన తప్పుడు పనుల్ని చూసి వదిలి పెట్టేస్తారనుకుంటే సజ్జల కంటే ఆమాయకుడు ఉండరేమో ?