జయ కోసం శశికళ బలి

తమిళనాడులో దాదాపు 1900 మంది నిఘా సిబ్బందితో 187 భవనాలపై కొనసాగుతున్న దాడులు చాలా సంచలన పరిణామాలకు కారణమవుతున్నాయి. జయలలిత సహచరి శశికళ పోగేసుకున్న అక్రమాస్తుల వెలికితీత కోసం సాగుతున్న ఈ దాడులు అటు అన్నాడిఎంకెలో ప్రకంపనలు సృష్టించాయి. మరో వైపున శశికళ శిబిరంలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఆమె మేనల్లుడు పార్టీ నాయకుడు దినకరన్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఫళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కలసి దేవాలయం వంటి జయలలిత ఇంటిపైనే దాడికి పాల్పడ్డారని విమర్శించారు. అయితే ఇవన్నీ కేంద్రం కనుసన్నల్లో జరిగాయి తప్ప తమకు సంబంధం లేదని ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు.ఇక శశికళ సోదరుడు దివాకరన్‌ మాత్రం ఏకంగా జయలలితపైనే దాడి చేశారు. ఆమె తన సోదరిని ఉపయోగించుకున్నారు గాని పోయేముందు ఎలాటి భద్రతలు లేకుండా వదిలేశారని వాపోయారు.1996 నుంచి చెన్న్‌లో కొనసాగుతున్న కేసులన్నిటిలోనూ జయలలిత ప్రథమ ముద్దాయి అని గుర్తు చేశారు. ఆమె తన పాటికి తాను పరలోకానికి వెళ్లిపోయింది గాని తన సోదరి శిక్షలు అనుభవిస్తూ బాధలు పడుతున్నదని ఆయన విచారం వెలిబుచ్చారు. ఈ వ్యాఖ్యలు తమకు అడ్డం తిరుగుతాయని గ్రహించిన దినకరన్‌ వెంటనే రంగంలోకి దిగి ఆవేశంలో ఆయన ఏదో అన్నారు గాని మాకు జయతో అనుబందం గర్వకారణమని ప్రశంసించారు. ఇప్పుడు చిన్నమ్మ శశికళ పడుతున్న కష్టాలకు జయ కారణం కాదని కూడా సర్దిచెప్పారు. అయితే ఒక్కసారిగా ఈ దాడులు చేయడంలో ఉద్దేశం పాలక అన్నాడిఎంకెను తమ తొత్తుగా మార్చుకోవాలనే బిజెపి వ్యూహంలో భాగమని బలమైన ఆరోపణలు వచ్చాయి. మిగిలిన వారి సంగతి అటుంచి స్వయంగా డిఎంకె నాయకుడు స్టాలిన్‌ ఒక ప్రకటన చేస్తూ అన్నాడిఎంకెను లొంగదీసుకుని తమిళనాడును గుప్పిటపెట్టుకోవాలని చూసూ బిజెపి కలలు కల్లలవుతాయని హెచ్చరించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close