టీడీపీలో నేతల్ని లోకేష్ అంత ఇబ్బంది పెట్టారా..?

ఏపీలో తెలుగుదేశం పార్టీ గెలిచి ఉంటే లోకేష్‌ను ఎంత పొగిడేవారో కానీ.. ఇప్పుడు టీడీపీ ఘోరపరాజయం పొందడంతో… ఆ క్రెడిట్ మొత్తాన్ని లోకేష్ ఖాతాలోనే వేస్తున్నారు. టీడీపీలో ఉండి ఏమీ మాట్లాడలేరు కాబట్టి .. బయటకు వెళ్లిన తర్వాత తమ విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. లోకేష్‌ను మాత్రమే టార్గెట్ చేసుకుంటున్నారు. బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో అత్యధికులు కారణంగా లోకేష్ నే చూపించినట్లు గాప్రచారం జరిగింది. కానీ బయటకు చెప్పలేదు. ఇప్పుడు… ఆ నలుగురి ప్రొద్భలంతో.. బీజేపీలో చేరుతున్న టీడీపీ నేతలు మాత్రం.. లోకేష్‌ను టార్గెట్ చేయడానికి మొహమాట పడటం లేదు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మరీ.. బీజేపీలో చేరిన బాపట్ల నేత అన్నం సతీష్ ప్రభాకర్… లోకేష్ వల్లే.. టీడీపీ ఓడిపోయిందని తీర్పునిచ్చారు.

ఎందరో నాయకులు లోకేష్ కారణంగా టీడీపీలో ఇబ్బంది పడుతున్నారన్నారు. లోకేష్ ఆధ్వర్యంలో పని చేయడం ఇష్టంలేకే టీడీపీకి రాజీనామా చేశానని ప్రకటించుకున్నారు. లోకేష్ వల్లే చంద్రబాబు నిట్టనిలువునా మునిగారని… లోకేష్ కారణంగానే త్వరలో టీడీపీ పూర్తిగా ఖాళీ కాబోతోందని జోస్యం చెప్పారు. లోకేష్ చేసిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో ఐటీ శాఖలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని… ఈ విషయంలో రెండు రోజుల్లో సీఎం జగన్‌ను కలుస్తానని కూడా ప్రకటించారు. కేంద్రంతో మాట్లాడి సీబీఐ విచారణ కోరతామని చెప్పుకొచ్చారు.

తెలుగుదేశం పార్టీలో లోకేష్ కోటరీ ఏర్పాటు చేసుకుని కొంత మంది నేతలను మాత్రమే ప్రొత్సహించారన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. ఆ ప్రొత్సాహానికి నోచుకోని నేతలు.. ఇప్పుడు.. ఇతర పార్టీల్లో చేరి లోకేష్ టార్గెట్ చేస్తున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి..లోకేష్‌ విషయంలో.. ఇప్పటి వరకూ ఉన్న ఇమేజ్‌కు.. ఇప్పుడు ఆయన కేంద్రంగా జరుగుతున్న రాజకీయ ఇమేజ్‌కు చాలా తేడా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close