కేసీఆర్ కన్నా మేఘానే టార్గెట్ చేస్తున్న షర్మిల!

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర వాయిదా వేసుకుని మరీ గవర్నర్ తమిళిసైను కలిశారు. ఓ పెద్ద ఫైల్ తీసుకెళ్లారు. అందతా కాళేశ్వరంలో జరిగిన అవినీతి అని.. గవర్నర్‌కు ఆధారాలిచ్చామని చెప్పారు. అవన్నీ కాళేశ్వరరం కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి అవినీతి వ్యవహారమని చెబుతున్నారు. చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని ఆమె చెబుతున్నారు. మేఘా కృష్ణారెడ్డిని ఆమె టార్గెట్ చేయడం ఇదే మొదటి సారి కాదు. గత రెండు నెలలుగా ఇదే పరిస్థితి. ఏ సందర్బం వచ్చినా ఇదే విధంగా దాడి చేస్తున్నారు.

మేఘా కృష్ణారెడ్డి పదమూడు వేల కోట్ల పన్నులు ఎగ్గొట్టారని ఐటీ ఇంటలిజెన్స్ నివేదిక ఇచ్చిందని ప్రకటించారు. కాళేశ్వరం కూడా మేఘా వల్లే మునిగిపోయిందన్నారు. ఇలా ప్రతి అంశంలోనూ మేఘా నే టార్గెట్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇటీవలి కాలంలో కేసీఆర్ కన్నా ఆమె ఎక్కువగా మేఘా కృష్ణారెడ్డినే ప్రత్యర్థిగా చూస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ఇలా ఎందుకు చేస్తున్నారన్నది కొంతమందికి అర్థం కావడం లేదు. మేఘా కృష్ణారెడ్డి .. ఇద్దరు పాలకులకు ఎంతో ఆప్తులు. రివర్స్ టెండర్లలో ఏపీలో అన్ని చోట్లా మేఘానే కాంట్రాక్టులు దక్కించుకుంది.

ఇప్పుడు మేఘానే ఎందుకు షర్మిల టార్గెట్ చేస్తున్నారంటే.. దాని వెనుక రాజకీయం ఉందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. రాజకీయం అంటే చిన్న విషయం కాదు. ఖర్చుతో కూడుకున్నది. పైగా షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. మేఘాను టార్గెట్ చేస్తే పార్టీ ఫండ్ వస్తుందన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని భావిస్తున్నారు. అయితే మేఘా వైపు నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో విపరీతంగా ఆరోపణలు చేస్తున్నారని.. ఫిర్యాదులు చేస్తున్నారని అంటున్నారు. నిజమేమిటో కానీ.. రాజకీయాల్లో ఎవరినైనా ప్రత్యేకంగా టార్గెట్ చేస్తే ఇలాంటి అనుమానాలే వస్తూ ఉంటాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close