లిక్కర్ స్కాం డబ్బుల ప్రధాన హ్యాండ్లర్గా పని చేసిన చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి .. ఆ సొమ్మును వివిధ వ్యక్తులతో పలు చోట్లకు తరలించారు. ఎన్నికల సమయంలో వాటిని మళ్లీ ఏపీకి తీసుకు వచ్చారు. అయితో ఓ చోట మాత్రం పోలీసులకు దొరికిపోయారు. ఓ లారీలో ప్రత్యేక అరలు ఏర్పాటు చేసుకుని తరలిస్తున్న రూ. ఎనిమిది కోట్ల ఇరవై లక్షల నగదును అప్పట్లో పోలీసులు పట్టుకున్నారు. అది చెవిరెడ్డిదేనని ప్రచారం జరిగినా అప్పట్లో అంతా సైలెంట్ గా ఉన్నారు.
ఇప్పుడు లిక్కర్ స్కాం దర్యాప్తులో భాగంగా ఆ డబ్బు లిక్కర్ స్కాంలో వసూళ్లు చేసినదేనని గుర్తించి.. సిట్ అధికారులు ఆరా తీశారు. ఈ విషయం తెలియగానే.. ఆ డబ్బులను తీసుకు వస్తూ అప్పట్లో పోలీసులకు చిక్కిన బాలాజీ, నవీన్ అనే వ్యక్తుల్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆజ్ఞాతంలోకి పంపేశారు. కానీ చెవిరెడ్డి లోపలికి వెళ్లడంతో వారు ఆజ్ఞాతంలో ఉండలేకపోయారు. పోలీసుల నిఘాకు దొరికిపోయారు.
మధ్యప్రదేశ్లో రహస్యంగా తలదాచుకున్న వీరిద్దర్నీ సిట్ పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ నుంచి తీసుకు వస్తున్నారు. వారు ఎన్ని ఎన్ని డబ్బులు రహస్యంగా తరలించారో చెబితే చెవిరెడ్డి ఇంకా లోతుకు కూరుకుపోతారు. ఇప్పటికే చెవిరెడ్డిని, వెంకటేష్ నాయుడు అనే ఆయన బినామీని సిట్ కస్టడీకి కోర్టు అప్పగించారు. లిక్కర్ స్కాం ఇప్పటికే ఓ కొలిక్కి వస్తోంది. అధికారులు దుబాయ్ కూడా వెళ్లి ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. త్వరలో ఈ కేసులో సంచలన పరిణామాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.