ఉన్నవే ఊడ్చేస్తే ఇక “ఏకగ్రీవ ఎన్నిక” నిధులా !?

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధుల విషయంలో ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు. అయితే ఇవి ఆర్థిక సంఘం నిధులను తీసుకున్న అంశంలో కాదు.. గత పంచాయతీ ఎన్నికప్పుడు ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఏకగ్రీవ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధుల గురించి. గత పంచాయతీ ఎన్నికల సమయలో ఏకగ్రీవాల కోసం ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. ఈ క్రమంలో గ్రామాలకు ఆఫర్లు ప్రకటించారు. జీవో ఆర్టీ నెం. 34ని విడుదల చేశారు.

గతంలో అంటే 2013 నాటి జీవో నెం. 1274ని సవరించి కొత్త జీవో జారీ చేశారు. గతంలో రెండు కేటగిరీలు ఉండేవి. ఈసారి 4 తరగతులుగా విభజించి పంచాయతీలకు ప్రయోజనం కల్పిస్తామని జీవోలో పేర్కొన్నారు. రెండు వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగితే ఆ పంచాయతీకి రూ.5 లక్షల వరకు నగదు ప్రోత్సాహం, అలాగే 2001 నుంచి 5000 లోపు జనాభా వుండే పంచాయతీలకు ఏకగ్రీవ ఎన్నికలు జరిగిన పక్షంలో రూ.10 లక్షలు నగదు ప్రోత్సాహం , 5001 నుంచి 10 వేల జనాభా వున్న పంచాయతీలకు ఏకగ్రీవం అయితే రూ.15 లక్షల నగదు ప్రోత్సాహం, పదివేల కన్నా అధికంగా వున్న పంచాయతీలకు రూ.20 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

ప్రభుత్వం కృషి ఫలించింది. మొత్తంగా 2,199 పంచాయితీలు ఏకగ్రీవం అయ్యాయి. కానీ ఇప్పటికీ నయాపైసా ప్రోత్సాహకం అందించలేదు. దీన్నే గుర్తు చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ప్రోత్సాహకాల కోసం విడుదల చేసిన ఉత్తర్వులు ఉత్తుత్తివి కాదని నిరూపించాలని జగన్‌కు సవాల్ చేశారు. ఉన్న నిధులే ఖాళీ చేసిన సర్కార్.. ఇప్పుడు జీవో ఇచ్చిన నిధులను విడుదల చేస్తుదా అన్నది పెద్ద పజిల్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close