ఆ ప్రాజెక్టులు కట్టొద్దని జగన్‌కు స్టాలిన్ లేఖ !

ఇప్పటికి తెలంగాణలో ఉన్న నీటి పంచాయతీలే తేల్చుకోలేకపోతున్నారు.. ఇప్పుడు తమిళనాడుతోనూ కొత్తగా వివాదాలకు దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఏపీ-తమిళనాడు సరిహద్దుల్లో కుశస్థలి నదిపై ఏపీ నిర్మిస్తున్న రెండు ప్రాజెక్టుల్ని తక్షణం నిలిపివేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు. కోశస్థలి నది పరివాహక ప్రాంతం రెండు రాష్ట్రాల్లో ఉంది. చెన్నై నగరానికి తాగు నీటి సరఫరా నిమిత్తం తమిళనాడు ప్రభుత్వం ఈ నదిపై పూండీ రిజర్వాయర్‌ను నిర్మించింది. దీనికి ఎగువన ఎలాంటి ఆనకట్టలు నిర్మించినా పూండీ జలాశయానికి నీటి కొరత ఏర్పడుతుంది.

ఆ ప్రభావం చెన్నై నగరంపై తీవ్రంగా ఉంటుందని అందుకే తమకు తెలియకుండా .. తమతో చర్చించకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని స్టాలిన్‌ జగన్ ను కోరారు. నిజానికి చాలా కీలకమైన ప్రాజెక్టుల్నే జగన్ సర్కార్ కట్టడం లేదు. చిన్న ప్రాజెక్టుల్నీ..అదీకూడా సరిహద్దుల్లో ఉన్న వాటిని ఎందుకు కడుతుందోనని చాలా మందికి సందేహం. నిజానికి అవి ప్రాజెక్టులు కాదు. టీడీపీ హయాంలోనే వాటికి నిధులు మంజూరయ్యారు. తమిళనాడు సరిహద్దులో నగరి వద్ద కుశస్థలి నదికి వరదలొస్తే నీరు వృథాగా సముద్రం పాలు కాకుండా ఒడిసిపట్టేందుకు గొలుసుకట్టు విధానంలో అనుసంధానమైన 20 చెరువులకు మళ్లించేలా ప్రాజెక్టుల్ని ఏపీ ప్రభుత్వం చేపట్టింది.

నిధులను కూడా గత ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ గత మూడేళ్లనుంచి కాంట్రాక్టర్లు పనులు చేపట్టలేదు. అయితే ఇప్పుడు హఠాత్తుగా తమిళనాడు వ్యతిరేకంగా లేఖ రాయడం చర్చనీయాంశం అవుతోంది.ఏపీ – తమిళనాడు మధ్య ఇప్పటికే పాలార్‌ నదిపై ప్రాజెక్టుల వివాదంఉంది. పాలార్‌ నదిపై ఆంధ్రప్రదేశ్‌ నిర్మిస్తున్న కుప్పం ప్రాజెక్టుపై చాలా కాలంగా రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎర్రబెల్లి సైలెన్స్ ఎందుకబ్బా..!!

బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కు అత్యంత సన్నితుడిగా పేరొందిన ఎర్రబెల్లి దయాకర్ ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఆ మధ్య ఆయన కాంగ్రెస్ లో చేరుతారని జోరుగా...

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close